• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Latest Telugu Breaking News - Flash News in AP & Telangana

Latest Telugu Breaking News - తొలివెలుగు - Tolivelugu

ToliVelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu app - latest telugu news app
tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • చెప్పండి బాస్
  • ENGLISH

విశాఖపై కమలనాధుల కన్ను

Published on : November 24, 2019 at 2:00 am

కమలానాధులు విశాఖపై కన్నేశారు. గ్రేటర్ విశాఖలో పాగా వేయడమే లక్ష్యంగా ఆ పార్టీ పావులు కదుపుతోంది. నేతలు తప్పితే కార్యకర్తలు లేని బీజేపీని క్షేత్రస్థాయిలో బలమైన శక్తిగా తయారు చేసేందుకు స్కెచ్ వేసింది. ఇందుకు పలువురు నేతలను టార్గెట్ చేసి పార్టీలోకి తెచ్చుకోవడమే కాకుండా, సామాజికవర్గాల సమీకరణల  ఆధారంగా వేట మొదలుపెట్టింది.  ఏపీలో అతిపెద్ద నగరంగా ఉన్న మహా విశాఖపట్నం అంటే రాజకీయ పార్టీలకు హాట్ సీట్. ఈ జిల్లాలో పాగా వేస్తే చాలు రాజకీయంగా, రాజ్యాధికారానికి దగ్గరైనట్లుగానే అన్ని పార్టీలు లెక్కలు వేసుకుంటుంటాయి.  అందుకే ప్రధాన పార్టీల అధినేతలు తమకు అత్యంత సన్నిహతమైన నేతలనే ఇక్కడ ఇన్ చార్జీలుగా పెట్టుకుంటుంటారు. ప్రస్తుతం వైసీపీలో జగన్ కు అత్యంత సన్నహితింగా ఉండే ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖ బాధ్యతలను చూసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీకి కూడా ఎన్నికలకు ముందు వరకు చంద్రబాబుకు కోజ్ అసొసియేట్ నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణ ఉండేవారు. అలగే జనసేన పవన్  కూడా  సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు అప్పగించారు. ఇప్పుడు బీజేపీకి కూడా విశాఖ వ్యవహారాలను చక్కబెట్టే నేత అవసరం పడింది.

విశాఖ జిల్లాలో పట్టు సంపాదించాలంటే సామాజికవర్గాల సమీకరణ తప్పనిసరనేది రాజకీయ పార్టీల ఫార్ములా.  కాపు, వెలమ, రెడ్డి,యాదవ, గవర సామాజికవర్గాలదే ఇక్కడ రాజకీయ ఆధిపత్యం. అన్ని పార్టీల్లోనూ, చివరకు కమ్యూనిస్టు పార్టీల్లో కూడా ఈ వర్గాలదే అగ్రతాంబూలం. కానీ  విశాఖ బీజేపీలో మాత్రం భిన్నమైన సామాజికవర్గ నాయకత్వం ఉంది. ఇప్పటి వరకు చాలా మంది బ్రాహ్మణ, వైశ్య, కమ్మ నేతల ప్రాతనిధ్యమే ఎక్కువగా ఉంది.  వాళ్లు కూడా రకరకాల వ్యాపారాలు చేసుకుంటూ అప్పుడప్పుడూ పార్టీలో తళుక్కున మెరిసే వారే ఎక్కువ. జిల్లాలో ఈ సామాజిక వర్గాల ఓటు బ్యాంక్ మిగిలిన వారితో పోల్చుకుంటే చాలా తక్కువ. ఈ విషయాన్ని గుర్తించిన బీజేపీ అగ్రనాయకత్వం అత్యంత బలమైన సామాజికవర్గాలకు చెందిన నేతలను పార్టీలోకి దించాలని ప్లాన్ వేసింది. ఓటు బ్యాంక్ అధికంగా ఉండి.. పార్టీలో ఏ సామాజికవర్గానికి పెద్దగా  ప్రాతినిధ్యం లేదో గుర్తించి వారందరికీ ప్రాధాన్యతను ఇస్తూ ముందుకు వెళ్లాలనేది కమలనాథుల ఆలోచన. దీనికి ఏమాత్రం ఆలస్యం చేయకుండా పలువురు నేతలను గుర్తించి వారిని పార్టీలోకి తెచ్చుకునే టార్గెట్ ను పెట్టుకుంది.

గతంలో విశాఖ నుంచి ఎంపీగా గెలిచి  కేంద్ర మంత్రిగా కూడా పని చేసిన దగ్గుబాటి పురంధేశ్వరి వల్ల పార్టీకి ఏ మాత్రం ప్రయోజనం లేదని 2014 ఎన్నికల సమయంలోనే బీజేపీ  నిర్థారణకు వచ్చింది. విశాఖ ఎంపీగా ఉన్న కంభంపాటి హరిబాబు టీడీపీతో పొత్తు పెట్టుకోగానే పొలిటికల్ స్రీన్ మీద కనబడకుండా పోయారు. ఇక బీజేపీ శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్  రాజుకు నియోజకవర్గంలో మంచి పేరే ఉన్నప్పటికీ గంటాని ఎదుర్కొని ముందుకు వెళ్లలేకపోతున్నారు. ఇక టీడీపీ పుణ్యమా అని ఉత్తరాంధ్ర పట్టబధ్రుల నియోజకవర్గానికి గెలిచిన ఎమ్మెల్సీ మాధవ్ కు రాజకీయ పటిమ లేదన్నది సొంత పార్టీ నేతల టాక్. పోనీ ప్రజాకర్షక శక్తి ఉందా అంటే అదీ లేదు. ఇలాంటి వారందరినీ నమ్ముకుని విశాఖలో ఎన్నికలకు వెళితే జరగబోయేదేంటో కమలనాథులు ముందే గ్రహించారు. అందుకే  విశాఖ వీధుల్లో  బీజీపీ జెండాను ఎగురవేసే నేతల కోసం అన్వేషణ సాగిస్తున్నారు.

టీడీపీ అధికారం కోల్పోయిన దగ్గర నుంచి ఏ పార్టీలోకి వెళ్లాలో తేల్చుకోలేక క్రాస్ రోడ్స్ లో నిల్చున్న గంటా శ్రీనివాసరావుని కమలదళం గుర్తించింది. బీజేపీ కాపు నేత ఎమ్మెల్సీ సోము వీర్రాజు రంగంలోకి దిగి గంటాని అధిష్టానంతో టచ్ లోకి పంపి మంతనాలు దిగ్విజయంగా ముగిసేలా వ్యవహారాన్ని చక్కబెట్టారు. ఇటీవలే విశాఖలో కూడా సోము వీర్రాజు, గంటా బ్రేక్ ఫాస్ట్  పాలిటిక్స్ ను  సైతం రక్తికట్టించి రాజకీయాలను రాష్ట్రవ్యాప్తంగా రాజేసారు.   గంటా అంటే కాస్తో కూస్తో ప్రజాకర్షణ నేతగా గుర్తింపు ఉంది.  ఆలాగే  సామాజికవర్గం వారీగా చూసుకుంటే కాపు కులం తరుఫున ప్రాతినిధ్యం వహించే సత్తా ఉన్నా నేతగా బీజేపీ భావిస్తోంది. పైగా గంటా కు  ఒక్క విశాఖలోనే కాకుండా అటు ఉత్తరాంధ్రలోని విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నేతలను  కూడా టచ్ లోకి తీసుకునే శక్తి ఉంది.  అంతే కాదు కాపు సామాజికవర్గానికి చెందిన రాజకీయ నేతగా గంటాకు రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీతో పాటుగా మిగిలిన పార్టీల్లో కూడా అందరితోనూ సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో గంటా వస్తే కాపు సామాజికవర్గాన్ని సెట్ చేసినట్లేనన్నది బీజేపీ నేతల మనసులో మాట.

tolivelugu app download

Filed Under: అవీ ఇవీ..., బిగ్ స్టోరీ

Primary Sidebar

ఫిల్మ్ నగర్

పుష్ప ఐటెం సాంగ్ లో బాలీవుడ్ భామ‌

పుష్ప ఐటెం సాంగ్ లో బాలీవుడ్ భామ‌

బుల్లెట్ పై ప‌వ‌న్- షూటింగ్ వీడియో వైర‌ల్

బుల్లెట్ పై ప‌వ‌న్- షూటింగ్ వీడియో వైర‌ల్

ర‌వితేజ బ‌ర్త్ డే- ఖిలాడీ టీం విషెష్ అదిరిపోయిందిగా..!(వీడియో)

ర‌వితేజ బ‌ర్త్ డే- ఖిలాడీ టీం విషెష్ అదిరిపోయిందిగా..!(వీడియో)

చైతూ కోసం త‌న సినిమా విడుద‌ల‌ వాయిదా వేసుకున్న నాని?

చైతూ కోసం త‌న సినిమా విడుద‌ల‌ వాయిదా వేసుకున్న నాని?

ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా స్టార్ట్ చెయ్యటానికి ముహూర్తం అదేనా ?

ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా స్టార్ట్ చెయ్యటానికి ముహూర్తం అదేనా ?

Advertisement

Download Tolivelugu App Now

tolivelugu app download

అవీ ఇవీ …

hyderabad metro rail runs under huge losses

మొరాయిస్తున్న మెట్రో రైళ్లు

హ‌క్కుల ర‌క్ష‌ణ కోస‌మే రైతుల ఉద్య‌మం- కోదండ‌రాం

హ‌క్కుల ర‌క్ష‌ణ కోస‌మే రైతుల ఉద్య‌మం- కోదండ‌రాం

ద్వివేది మెడ‌కు చుట్టుకుంటున్న ఏపీ ఎన్నిక‌ల పంచాయితీ

ద్వివేది మెడ‌కు చుట్టుకుంటున్న ఏపీ ఎన్నిక‌ల పంచాయితీ

రైత‌న్న‌ల‌పై పోలీసుల దాడిని ఖండించిన రేవంత్ రెడ్డి

రైత‌న్న‌ల‌పై పోలీసుల దాడిని ఖండించిన రేవంత్ రెడ్డి

రైతు ఆందోళ‌న‌ల‌పై హోంశాఖ అత్య‌వ‌స‌ర భేటీ

రైతు ఆందోళ‌న‌ల‌పై హోంశాఖ అత్య‌వ‌స‌ర భేటీ

nagam janardhan reddy

ఇది కాంట్రాక్ట‌ర్ల గుప్పిట్లో ఉన్న తెలంగాణ‌

Copyright © 2021 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)