మునుగోడులో ఓట్ల నమోదుపై హైకోర్టులో బీజేపీ ఈ రోజు రిట్ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ పై హైకోర్టు ఎల్లుండి విచారణ చేపట్టనుంది.
జులై 31 వరకు ఉన్న ఓటరు జాబితాను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని పిటిషన్ లో బీజేపీ కోరింది. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేసింది.
ఫార్మ్- 6 కింద వచ్చిన దరఖాస్తుల్లో తప్పుడు ఓటర్లు ఉన్నారని బీజేపీ ఆరోపణలు చేసింది. అతి తక్కువ సమయంలో సుమారు 25 వేల దరఖాస్తులు వచ్చాయని బీజేపీ పేర్కొంది.
మునుగోడు ఓటరు జాబితాను ఈ నెల 14 న ఎన్నికల సంఘం ప్రకటించనుంది. న్యాయస్థానం ఆదేశించే వరకు జాబితాను ప్రకటించకుండా ఆదేశాలు ఇవ్వాలని బీజేపీ కోరింది.