• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Top News » ‘నెహ్రూ కుటుంబాన్ని మీరు అవమానపరచలేదా ?’ ప్రియాంక గాంధీ

‘నెహ్రూ కుటుంబాన్ని మీరు అవమానపరచలేదా ?’ ప్రియాంక గాంధీ

Last Updated: March 26, 2023 at 1:23 pm

తన సోదరుడు రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడంపై తీవ్రంగా స్పందించిన కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ .. ప్రధాని మోడీ, ఆయన సహచరులు నెహ్రూ కుటుంబాన్ని ఎన్నోసార్లు అవమానపరిచారని ఆరోపించారు. రాహుల్ గాంధీని ఆమె’ అమరవీరుని కుమారునిగా’ అభివర్ణిస్తూ.. బీజేపీ ప్రతిరోజూ ఆయనపై అవమానకర వ్యాఖ్యలు చేస్తూ వచ్చిందని, ఆయనను దేశద్రోహిగా దుయ్యబట్టిందని, ‘మీర్ జాఫర్’ గా పోల్చిందని ఆమె అన్నారు. ‘మీరు రాహుల్ తల్లిని అవమానపరిచారు. రాహుల్ కి తన తల్లి ఎవరో తెలియదని మీ ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. నా కుటుంబాన్ని రోజూ అవమానపర్చడమే పనిగా పెట్టుకున్నారు .. కానీ మీపై ఏ నాడూ కేసులు నమోదు కాలేదు’ అని ప్రియాంక గాంధీ మండిపడ్డారు.

 

Rahul Gandhi disqualified | BJP insulted my family but RaGa hugged PM: Priyanka  Gandhi at Congress's Satyagraha - India Today

ఈ కుటుంబం నెహ్రూ పేరును ఎందుకు వినియోగించుకోదని ఈ ప్రధాని పార్లమెంట్ నిండు సభలో పేర్కొన్నారని, కాశ్మీరీ పండిట్ల కుటుంబాన్ని మొత్తం ఆయన అవమానపరిచారని ఆమె విమర్శించారు. తన తండ్రి తరువాత తన కుటుంబ పేరును ముందుకు తీసుకువెళ్తున్న ఓ కుమారుడిపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ప్రియాంక గాంధీ అన్నారు.

ఇక పార్టీ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే.. మోడీ సామాజికవర్గాన్ని రాహుల్ కించపరిచారన్న బీజేపీ ఆరోపణను ప్రస్తావిస్తూ .. నీరవ్ మోడీ ఓబీసీయా.. మెహుల్ చోక్సీ ఓబీసీయా అని ప్రశ్నించారు. అలాగే లలిత్ మోడీ కూడా ఓబీసీయా అన్నారు. బ్లాక్ మనీతో దేశం వదిలిపారిపోతున్న ఆర్ధిక నేరగాళ్ళను ఉద్దేశించి మాత్రమే రాహుల్ వ్యాఖ్యానించారని చెప్పారు.

దేశవ్యాప్తంగా ఇలాంటి సత్యాగ్రహాలు, నిరసనలు కొనసాగిస్తామని, భావ ప్రకటనా స్వేచ్ఛను కాపాడేందుకు పోరాడతామని ఆయన పేర్కొన్నారు. రాహుల్ కి సంఘీభావంగా అన్ని విపక్షాలు కలిసివస్తున్నందుకు వాటికి కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. ఢిల్లీలో ఆదివారం జరిగిన సత్యాగ్రహంలో పి.చిదంబరం, జైరాంరమేష్, సల్మాన్ ఖుర్షీద్, ప్రమోద్ తివారీ, అజయ్ మాకెన్, అధిర్ రంజన్ చౌదరి వంటి పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు.

 

Primary Sidebar

తాజా వార్తలు

మళ్లీ తాత అయిన ముఖేష్ అంబానీ

కంగన్ వ్యాలీ నేషనల్ పార్క్ లో…రేరెస్ట్ మౌస్ డీర్…!

నకిలీ విత్తనాల విషయంలో జాగ్రత్త వహించండి!

ఓటీటీలకు కీలక ఆదేశాలు జారీ చేసిన కేంద్రం

మహిళపై ఎమ్మెల్యే రెడ్యా నాయక్ ఆగ్రహం

ఎంక్వైరీ స్టార్ట్..! ఆదిత్యకు చుక్కలేనా?

హైదరాబాద్ లో భారీ వర్షం.. మూడు రోజులు బీ అలర్ట్!!

వేంక‌టేశ్వ‌ర స్వామి ఆలయాన్ని సందర్శించిన సీఎం కేసీఆర్

బీజేపీ లేకపోతే..తెలంగాణ వచ్చేది కాదు!

ఇకనైనా చర్యలు తీసుకోండి.. మహిళా రెజ్లర్ల పోరాటంపై కవిత

భోళాశంకర్ మేనియా షురూ

చాయ్ బిస్కెట్.. మరో బంపరాఫర్

ఫిల్మ్ నగర్

Bholaa Shankar mania will start soon

భోళాశంకర్ మేనియా షురూ

Mem famous for 99 rupees only

చాయ్ బిస్కెట్.. మరో బంపరాఫర్

Srikanth Addala new movie details

ఎన్నాళ్లకెన్నాళ్లకు అడ్డాల

Allu Sirish as BUDDy

బడ్డీగా రాబోతున్న అల్లు శిరీష్

Teja hopes on Ustad Bhagat Singh

పవన్ సినిమాకు తేజ రివ్యూ

లేటెస్ట్ ట్రెండ్ గా...లేటు వయసు ప్రేమ పెళ్లిళ్లు ...!

లేటెస్ట్ ట్రెండ్ గా…లేటు వయసు ప్రేమ పెళ్లిళ్లు …!

29 ఏళ్ల అమ్మాయి.. 83 ఏళ్ల అబ్బాయి!!

29 ఏళ్ల అమ్మాయి.. 83 ఏళ్ల అబ్బాయి!!

ప్రమాదానికి గురైన పుష్ప-2 టీమ్..పలువురు నటులకు గాయాలు..!

ప్రమాదానికి గురైన పుష్ప-2 టీమ్..పలువురు నటులకు గాయాలు..!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap