• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » రాజకీయాలు » అగ్ర నేతల సమక్షంలో.. నామినేషన్ వేసిన రాజగోపాల్ రెడ్డి

అగ్ర నేతల సమక్షంలో.. నామినేషన్ వేసిన రాజగోపాల్ రెడ్డి

Last Updated: October 10, 2022 at 3:53 pm

మునుగోడులో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. అభ్యర్థులు ఒక్కొక్కరుగా నామినేషన్ దాఖలు చేస్తున్నారు. తాజాగా బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి భారీ ర్యాలీతో నామినేషన్ వేశారు. మునుగోడు క్యాంపు కార్యాలయం నుంచి బీజేపీ శ్రేణులతో కలిసి ఇడికుడ, బంగారిగడ్డ మీదుగా.. చండూర్ ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లారు రాజగోపాల్.

భారీ ర్యాలీ అనంతరం నామినేషన్ వేశారు. కోమటిరెడ్డి వెంట తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్‌, రఘునందన్‌ రావు సహా పలువురు నేతలు ఉన్నారు. మునుగోడులో గెలుపు కోసం బీజేపీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. ఎప్పటికప్పుడు సమీక్షలు, సమావేశాలు నిర్వహించుకుంటూ గెలుపు వ్యూహాలపై చర్చలు జరుపుతోంది.

పార్టీ అగ్రనేతలు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్ మండల ఇంఛార్జులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రచారం ముగిసేవరకు ఇంఛార్జులు నియోజకవర్గం దాటి వెళ్లకూడదని ఇప్పటికే బండి సంజయ్ ఆదేశించారు. ఈ సెమీ ఫైనల్ ఫైట్ లో గెలిస్తేనే అసలు ఎన్నికల్లో ప్రభావం చూపొచ్చని బీజేపీ నమ్ముతోంది. అందుకే ఏ అవకాశాన్నీ వదలకుండా ఓటర్లను ఆకర్షించే పనిలో ఉంది.

మరోవైపు నామినేషన్ సందర్భంగా మీడియాకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇచ్చారు రాజగోపాల్ రెడ్డి. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలపై స్పందించారు. తాను తప్పుచేసినట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ చేశారు.ఆధారాలు వుంటే మీడియా ముందుకు రావాలన్నారు. ప్రజస్వామ్యాన్ని ఖూనీ చేసి, నియంతలా పాలిస్తున్న కేసీఆర్‌ దిగి రావాలంటే ఉపఎన్నిక రావాలని నమ్మానని చెప్పారు. అప్పుడే ప్రభుత్వం దిగి వస్తుందని రాజీనామా చేసినట్లు తెలిపారు. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ, హుజూరాబాద్ ఎన్నికలతో బీజేపీ బలం పెరిగిందని.. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ ప్రజల విశ్వాసం కోల్పోయిందని విమర్శించారు రాజగోపాల్ రెడ్డి.

Primary Sidebar

తాజా వార్తలు

‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ మూవీ సాంగ్ అదుర్స్…!

హైదరాబాద్ కు ఎల్లో అలర్ట్.. ఆ రెండు రోజులు జాగ్రత్త..!

ఇక్కడ ఉగాదంటే షడ్రుచుల పచ్చడి మాత్రమే కాదు…అంతకు మించి…!?

యూటర్న్ తీసుకున్న అల్లరి నరేష్

జీ8 ఏర్పాటుపై కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు…!

న్యూలుక్ లో హీరో నితిన్ … బీష్మ కాంబో రిపీట్ ….!

షాకింగ్ నిర్ణయం తీసుకున్న నయన తార

రేవంత్ రెడ్డి బాగా మాట్లాడతారు.. గవర్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

అదానీ అంశంపై జేపీసీ వేయాల్సిందే.. కాంగ్రెస్

కేటీఆర్, బండి సంజయ్ ల ఉగాది పంచాంగం..!

భద్రాద్రి బ్రహ్మోత్సవాలు.. కేసీఆర్, గవర్నర్ లకు ఆహ్వానం

భారంగా మారిన వైద్యు ఖర్చులు.. యువకుడి బలవన్మరణం..!

ఫిల్మ్ నగర్

‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ మూవీ సాంగ్ అదుర్స్...!

‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ మూవీ సాంగ్ అదుర్స్…!

యూటర్న్ తీసుకున్న అల్లరి నరేష్

యూటర్న్ తీసుకున్న అల్లరి నరేష్

న్యూలుక్ లో హీరో నితిన్ … బీష్మ కాంబో రిపీట్ ....!

న్యూలుక్ లో హీరో నితిన్ … బీష్మ కాంబో రిపీట్ ….!

షాకింగ్ నిర్ణయం తీసుకున్న నయన తార

షాకింగ్ నిర్ణయం తీసుకున్న నయన తార

ఈ సారి మీ ఊహకు మించి అంటూ.. NBK108 ఫస్ట్ లుక్!

ఈ సారి మీ ఊహకు మించి అంటూ.. NBK108 ఫస్ట్ లుక్!

భగత్ సింగ్ లోనా..నేనా..! వట్టిరూమర్స్ బాస్..!!

భగత్ సింగ్ లోనా..నేనా..! వట్టిరూమర్స్ బాస్..!!

యోగా ప్రాక్టీస్ తో అల్లుఅర్జున్ కి షాకిచ్చిన అర్హ..!

యోగా ప్రాక్టీస్ తో అల్లుఅర్జున్ కి షాకిచ్చిన అర్హ..!

ఉగాది సందర్భంగా భోళాశంకర్ కంటెట్ పోష్టర్ ....!

ఉగాది సందర్భంగా భోళాశంకర్ కంటెట్ పోష్టర్ ….!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap