• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Local News » పరీక్షలను కూడా సమర్థవంతంగా నిర్వహించలేకపోతున్నారు!!

పరీక్షలను కూడా సమర్థవంతంగా నిర్వహించలేకపోతున్నారు!!

Last Updated: March 16, 2023 at 7:33 pm

మాక్సిమం పాలిటిక్స్.. మినిమం రూలింగ్ అన్నట్లుగా కేసీఆర్ పాలన సాగుతోందని అన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు, కవిత లిక్కర్ కేసు, పేపర్ లీకేజీ.. ఇలా అన్నింటినీ రాజకీయం చేసి.. తన అసమర్థత.. అవినీతి పాలనను కప్పిపుచ్చుకోవాలని కేసీఆర్ చూస్తున్నాడని అన్నారు. కేసీఆర్ కు ప్రతీదీ రాజకీయం చేయడం పరిపాటి అయ్యిందని ఆరోపించారు. కోటి ఆశలతో పరీక్షలకు ప్రిపేర్ అయిన నిరుద్యోగులకు.. ఈ వార్త పిడుగు పడినట్లు అయ్యిందన్నారు.

ఈ వ్యవహారంపై దృష్టి పెట్టి, సమగ్ర దర్యాప్తు చేయించి, కేసీఆర్ తన నిజాయితీ నిరూపించుకోవాలని కోరారు. సిట్టింగ్ జడ్జ్ తో విచారణ జరపించి, దోషులు తప్పించుకోకుండా వారికి కఠిన శిక్ష పడేలా చూడాల్సిన ముఖ్యమంత్రి.. రాజకీయ రంగు పూసి తప్పించుకోవాలని చూడడం తన అసమర్థ పానలకు నిదర్శనమన్నారు. తెలంగాణలో మొత్తం 30 లక్షల మంది నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు.

ఇంటికో ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్.. కేవలం నోటిఫికేషన్లతో సరిపెడుతున్నారని చెప్పారు. ఒకటి అర పరీక్షల్ని సైతం పకడ్బందీగా నిర్వహించలేని నిస్సహాయక స్థితిలో కేసీఆర్ ప్రభుత్వం ఉందని దుయ్యబట్టారు. ఎంతో మంది తల్లులు కూలీ పని చేసి, తమ పిల్లలకు చదువులు చెప్పించి, ఉద్యోగం కోసం ఎదురు చూసే వారి బాధ కేసీఆర్ కి అర్థం అవుతుందా? అని నిలదీశారు.

సర్వీస్ కమిషన్ పరీక్ష అంటేనే అత్యంత పగడ్బందీగా నిర్వహించాల్సిన పరీక్ష అని.. అక్కడ సమర్థులను, నిజాయితీపరులకు అవకాశం ఇవ్వాలని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. పరీక్షా పత్రాలు లీక్ అవ్వకుండా, అవినీతి జరగకుండా నిఘా పెట్టాలన్నారు. కానీ కేసీఆర్ ఇలాంటి వాటిపై కాకుండా.. ప్రత్యర్థి నాయకుల మీద నిఘా పెట్టేందుకు ఇంటిలిజెన్స్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా కేసీఆర్ దీనికి బాధ్యత వహించి, నిరుద్యోగుల ఆందోళన తొలగించాలని కోరారు.

Primary Sidebar

తాజా వార్తలు

సామ్ యాజ్ బ్యూటీ ఇన్ బ్లాక్ …ఎందుకబ్బా…!?

అసత్య ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానెళ్ళపై….నటి హేమ కంప్లైంట్ ..!

‘పాపులర్ సెలెబ్రిటీస్’లిస్ట్ లో టాప్ కి చరణ్…చేజార్చుకున్న కోహ్లీ..!

పాము విషాన్ని నోటితో తీసి తల్లిని కాపాడుకున్న కూతురు…!

ముగిసిన ఎమ్మెల్సీ కవిత విచారణ..!

చైనాలో మరణ మృదంగానికి జిన్ పింగ్ వైఫల్యమే కారణమా..!

పాయల రాజ్ పుత్ కు హెల్త్ ప్రాబ్లమ్….!?

వాడిపోయిన ఆకుకూరలకు రసాయనాల రెన్యువల్…వీడియో వైరల్… !

బీజేపీ, జనసేన మధ్య దోస్తీ ముగిసినట్టేనా… !

టీఎస్పీఎస్పీ పేపర్ల లీకేజీ… బండి సంజయ్ కు సిట్ నోటీసులు..!

తగ్గని‘నాటు నాటు’ఫీవర్…ఎడిసన్ సిటీలో దక్కిన మరో గౌరవం …!

సత్య హరిశ్చంద్రుడికి మెహుల్ చోక్సీ మరో బంధువు… మోడీపై కేటీఆర్ సెటైర్లు..!

ఫిల్మ్ నగర్

సామ్ యాజ్ బ్యూటీ ఇన్ బ్లాక్ ...ఎందుకబ్బా...!?

సామ్ యాజ్ బ్యూటీ ఇన్ బ్లాక్ …ఎందుకబ్బా…!?

అసత్య ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానెళ్ళపై....నటి హేమ కంప్లైంట్ ..!

అసత్య ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానెళ్ళపై….నటి హేమ కంప్లైంట్ ..!

‘పాపులర్ సెలెబ్రిటీస్’లిస్ట్ లో టాప్ కి చరణ్...చేజార్చుకున్న కోహ్లీ..!

‘పాపులర్ సెలెబ్రిటీస్’లిస్ట్ లో టాప్ కి చరణ్…చేజార్చుకున్న కోహ్లీ..!

పాయల రాజ్ పుత్ కు హెల్త్ ప్రాబ్లమ్....!?

పాయల రాజ్ పుత్ కు హెల్త్ ప్రాబ్లమ్….!?

తగ్గని‘నాటు నాటు’ఫీవర్...ఎడిసన్ సిటీలో దక్కిన మరో గౌరవం ...!

తగ్గని‘నాటు నాటు’ఫీవర్…ఎడిసన్ సిటీలో దక్కిన మరో గౌరవం …!

nivedha pethuraj comments on viswaksen he will become a successful director

విశ్వక్‌ ఒక లోకేశ్‌ కనగరాజ్‌ లా అవుతాడు!

kota srinivasa rao is healthy

నేను ఆరోగ్యంగానే ఉన్నాను: కోట!

rashmika tired with saami saami step

ఎప్పుడూ ఎందుకు అదే అడుగుతున్నారు: రష్మిక!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap