బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిలుగా బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, గుజరాత్ ఎమ్మెల్యే ఎస్సీ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి శంభునాథ్ తొండియా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్రా శివన్నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై పోరాడుతున్న ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనన్నారు. ఏప్రిల్ లో ఎస్సీల బహిరంగ సభ విజయవాడలో నిర్వహించబోతున్నామన్నారు.
జగన్ ప్రభుత్వంపైన గళమెత్తే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. ఎస్సీలను ప్రభుత్వం ఓటు బ్యాంకుగా వాడుకుంటుందన్నారు. ఏపీలో అభివృద్ధి లేదన్నారు. వైన్ మాఫియా, శాండ్ మాఫియా వైసీపీ చేస్తుందని ఆరోపించారు. ఏపీని అభివృద్ధి చేయకుండా.. చేస్తూ ట్రేడింగ్ కంపెనీ మాదిరి రాష్ట్ర ప్రభుత్వం తయారైందని విమర్శలు గుప్పించారు.
వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రచారం చేసుకుంటున్నారన్నారు. 35 లక్షల ఇళ్లకు 1 లక్షా 80 వేల రుణం కేంద్రమే ఇస్తుందన్నారు. విద్య ద్వారా ఎనిమిది రకాల సేవలను అందిస్తున్నామన్నారు. జగన్ నవరత్నాలు కన్నా మోదీ సంక్షేమమే ఏపీలో ఎక్కువన్నారు. ఇవేగాక 8 లక్షల కోట్ల రూపాయలు ఏపీకి అదనంగా కేటాయించి అభివృద్ధి చేస్తున్నామన్నారు.
వైసీపీ, టీడీపీ కేంద్రం చేసింది ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. మేము సంక్షేమం చేస్తుంటే వైసీపీ ప్రభుత్వం ప్రజలను చంపేస్తున్నారని దుయ్యబట్టారు. 2024లో అధికారంలోకి రావడానికి అర్హత ఉన్న పార్టీ బీజేపీనే అన్నారు. ఏపీ ప్రభుత్వానికి సవాల్ చేస్తున్నా.. కేంద్రమే ఏపీలో సంక్షేమం చేస్తుంది.. రాష్ట్ర ప్రభుత్వానిది ఏమీ లేదన్నారు సోము వీర్రాజు.