విష్ణు వర్థన్ రెడ్డి,
బీజేపీ రాష్ట్ర కార్యదర్శి.
దేశంలో చాలా రాష్ట్రాల్లో బీజేపీ గెలుస్తుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి, టీడీపీకి వేసే ఓట్లు దుర్వినియోగం అవుతాయి. 2024 లో కూడా మోడీ దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం ఖాయం. ఎక్కడ ఎన్నికలు జరిగిన ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగితే..ఇక్కడ మాత్రం ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా జరుగుతున్నాయి. టీడీపీ తమ నాయకులను పోటీలో పెట్టడానికి కూడా వెనకడుగు వేస్తోంది.
టీడీపీకి వైసీపీని ఎదుర్కొనే స్థాయి లేదు. వైసీపీకి పోటీగా నిలిచే పార్టీ బీజేపీ మాత్రమే. వైసీపీ పట్టభద్రులను ప్రలోభాలకు గురి చేస్తుంది. వైసీపీ నాయకులు అసలు అభివృద్ధి గురించి మాట్లాడటం లేదు. వార్తలు రాసిన జర్నలిస్ట్ లపై ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేయడం విడ్డూరంగా ఉంది. హై కోర్టు చెప్పిన జర్నలిస్టులపై కేసులు నమోదు చేశారు. సీఐ పై ఇప్పటివరకు ఎందుకు విచారణ చేయలేదు.
ఏపీ హోమ్ మంత్రి ఈ ఘటన పై సమాధానం చెప్పాలి. అధికారులు వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తే మాకు ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు వస్తాయని ఆలోచన చేస్తున్నారు.. కానీ ఈ విషయంలో ఎన్నికల కమిషన్ ఎందుకు ఈ ఘటన సుమోటోగా తీసుకోరు. ప్రజలు కట్టే పన్నులను జీతాలుగా తీసుకొని వైసీపీకి తొత్తులుగా పనిచేస్తున్నారు. ఈ మధ్య రాష్ట్ర ముఖ్యమంత్రి బటన్ నొక్కి రైతుల ఖాతాలో డబ్బులు వేశారు. మీ మానిఫెస్టో లో 12,500 రైతులకు ఇస్తామని చెప్పారు. ఈ నాలుగు సంవత్సరల కాలంలో ఎంత వేశారో శ్వేత పత్రం ఇవ్వాలి.
కేంద్రం ఇస్తున్న డబ్బులు కలిపి ఇస్తుంటే మీరు అందరికీ క్షమాపణ చెప్పి రూ. 24 వేలు ఇవ్వాలి. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
టీడీపి 175 స్థానాలలో పోటీ చేస్తామని చెప్పడం లేదు. బీజేపీ, జనసేన కలిసి 175 స్థానాలలో పోటీ చేస్తాయి.. రానున్న రోజుల్లో సంచలనాత్మక నిర్ణయాలు బీజేపీ తీసుకోబోతుంది. రాష్ట్రంలో లక్ష కోట్లతో రోడ్ల నిర్మాణం జరుగుతున్నాయి, కేంద్రం అభివృధి చేస్తుంటే కొంత మంది ఏడుస్తున్నారు . ప్రజలు మాకు ఓట్లు వేయకున్న మేము రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం.
రాయలసీమకు సంభందించిన చంద్రబాబు,వైఎస్ జగన్ సీమను మోసం చేశారు. మేము అధికారంలోకి వస్తే రాయలసీమ డిక్లరేషన్ ఖచ్చితంగా అమలు చేస్తాం.
మీడియా సంస్థలు దేశ చట్టాల పరిధిలో ఉండి పనిచేస్తున్నాయి. దేశంలోనే ఏపీ,తెలంగాణ,ఢిల్లీ ముఖ్యమంత్రి తమ సొంత మీడియాతో పబ్లిసిటీ చేసుకుంటూ రాష్ట్రాలను భ్రష్టు పట్టిస్తున్నాయి.
నిస్వార్ధంగా పనిచేస్తున్నటువంటి ప్రధానమంత్రిని కూడా ఇష్టానుసారంగా తిడుతూ తమ తమ రాష్ట్రంలో లబ్ధి పొందెందుకు ప్రయత్నించడం సిగ్గుచేటు . రాష్ట్రాల అభివృద్ధిని పక్కన పెట్టి అధికారం నిలుపుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతం అభివృద్ధిలో పూర్తిగా వెనుకబడింది. నాలుగు సంవత్సరాల కాలంలో రాయలసీమ ప్రాజెక్టులకు ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి ఇస్తున్నటువంటి నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం పక్కకు మళ్లిస్తున్నారు.