• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Local News » ఇది తెలంగాణా రాష్ట్రం కాదు..తాగుబోతుల రాష్ట్రం : బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్

ఇది తెలంగాణా రాష్ట్రం కాదు..తాగుబోతుల రాష్ట్రం : బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్

Last Updated: December 3, 2022 at 11:49 pm

బీజేపి ఎమ్.పి కె.లక్ష్మణ్ రాష్ట్రప్రభుత్వంపై తీవ్రవిమర్శలు చేసారు. తెలంగాణా పోరాటంలో ఆత్మత్యాగం చేసిన శ్రీకాంత్ చారి వర్థంతి సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రాజెక్టుల పేరుతో రాష్ట్రంలోని భూములన్నీ అన్యాక్రాంతమవుతున్నాయని, కేసీఆర్ ప్రభుత్వం పెద్దఎత్తున అవినీతికి పాల్పడుతుందని మండిపడ్డారు. తమ అవినీతి కార్యక్రమాలన్నీ బైటపడాయనే భయంతోనే సీబీఐని రావొద్దంటున్నారని ఆయన పేర్కొన్నారు. కేంద్రఇచ్చిన నిధులన్నీ అవినీతిదారి మళ్ళిస్తున్నారని, స్కీములన్నీ స్కాములుగా మార్చేస్తున్నారని యద్దేవాచేసారు. అభివ్రుద్ధి మరచి స్వలాభంకోసం రాష్ట్రాన్ని తాకట్టుపెడుతున్నందుకు ప్రాణత్యాగం చేసిన శ్రీకాంత్ చారి ఆత్మఘోషిస్తుందని లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేసారు.

ప్రస్తుతం జరుగుతున్న ఐటీ, ఈడీ దాడులకు కేంద్రప్రభుత్వానికి ఏమాత్రం సంబంధంలేదని లక్ష్మణ్ పేర్కొన్నారు. అవినీతి ఆరోపణలంటూవస్తే సీఎమ్ కూతురైనా..ఎవరైనా తమనిర్దోషిత్వాన్ని నిరూపించుకోవలసిందేనన్నారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని అందరూ సమానమేనని స్పష్టంచేసారు. తెలంగాణాలో గల్లీగల్లీకో మద్యం దుకాణం పెట్టి, తెలంగాణా రాష్ట్రాన్నికాస్తా తాగుబోతుల రాష్ట్రంగా మార్చడానికి ప్రభుత్వం తీవ్రంగా క్రుషిచేందని ఎమ్.పి లక్ష్మణ్ యద్దేవాచేశారు.

“తెలంగాణా ప్రజల ప్రయోజనాల ద్రుష్ట్యా మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరారు. కేసీఆర్ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చకుండా..ప్రజా విరుద్ధంగా పాలన సాగిస్తున్నారు. డబుల్ బెడ్ రూం. ఇళ్ళు,దళితులకు మూడెకరాల భూమి హామీలను విస్మరించారు.ప్రభుత్వ భూములన్ని అన్యాక్రాంతం అవుతున్నాయి.పేదవాడు వందగజాల స్థలాన్ని కూడా కొనకుండా విపరీతంగా ధరలు పెంచారు. ప్రాజెక్టుల పేరుతో పెద్దఎత్తున అవినీతి జరిగింది. అవినీతి సొమ్ముతో రాజ్యమేలాలని చూస్తున్నారు.కేసీఆర్ కుటుంబం చేసే అవినీతికి అడ్డుకట్టవేయకుండా ఉండేందుకు సీబీఐని తెలంగాణాకు రానియ్యం అంటున్నారు. “ – కె.లక్ష్మణ్ బీజేపీ ఎంపీ

Primary Sidebar

తాజా వార్తలు

ఇద్దరు అబ్బాయిలు పెళ్ళి చేసుకుంటామని కోర్టుకెక్కారు..!

సుప్రీంకు కొత్తగా ఐదుగురు న్యాయమూర్తులు

హైదరాబాద్ కి ముంచుకొస్తున్న హై టెంపరేచర్…!

తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక డైరీ ఆవిష్కరణ

బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే.. కేసీఆర్‭ కు చివరి ఎన్నికలు ఇవే..!

కేటీఆర్ అబద్దాలను కూడా వినసొంపుగా చెప్పారు!

ఎన్టీఆర్ వచ్చినా లాభం లేదు.. లక్ష్మీ పార్వతి కీలక వ్యాఖ్యలు

కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశాడు!

ఉద్యమకారులను తమ అవసరాల కోసం వాడుకుంటున్నారు

గట్టు బాగు చేయడానికి పెట్టిన నిప్పు… ముప్పుతెచ్చింది.!

ఇంటి స్థలాల కోసం జర్నలిస్టులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి..!

తుంగతుర్తిలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా!

ఫిల్మ్ నగర్

వాణీ జయరాం మృతిపై ప్రముఖుల సంతాపం

వాణీ జయరాం మృతిపై ప్రముఖుల సంతాపం

వాణీ జయరాంకు తెలుగువారితో జన్మజన్మల బంధం

వాణీ జయరాంకు తెలుగువారితో జన్మజన్మల బంధం

వాణీ జయరాం మృతి.. అనుమానాస్పదం..!

వాణీ జయరాం మృతి.. అనుమానాస్పదం..!

జపాన్ లో ఆర్‌ఆర్‌ఆర్‌ 105 వ రోజు కలెక్షన్లు!

జపాన్ లో ఆర్‌ఆర్‌ఆర్‌ 105 వ రోజు కలెక్షన్లు!

సరిగ్గా చేయలేక ఏడుస్తూ బయటకు వచ్చేశా!

సరిగ్గా చేయలేక ఏడుస్తూ బయటకు వచ్చేశా!

అమిగోస్ ట్రైలర్‌ రివ్యూ!

అమిగోస్ ట్రైలర్‌ రివ్యూ!

హరిహర వీర మల్లు నుంచి కొత్త స్టిల్స్‌!

హరిహర వీర మల్లు నుంచి కొత్త స్టిల్స్‌!

ట్రైలర్‌ రేంజ్ లో విజయ్ వీడియో!

ట్రైలర్‌ రేంజ్ లో విజయ్ వీడియో!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap