కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ రియాక్ట్ అయ్యారు. శుక్రవారం ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేస్తూ చురకలంటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో భారతదేశం తన ఆశయాలను సాధించే దిశగా క్రమంగా పుంజుకుంటోందన్నారు.
జీవితంలో ఎన్నడూ పని చేయనవసరం లేని రాజవంశీయులు, ఎప్పుడూ లక్ష్యాలను, ఆశయాలను, శ్రమను వెక్కిరిస్తూంటారని ఆరోపణలు చేశారు. భారతదేశం చైనా కంటే వెనుకబడి ఉంటే, అది ఆమె తండ్రి, అలాంటి ఇతర రాజవంశీల వారు చేసిన దశాబ్దాల రాజకీయాల కారణంగానే అని ఎద్దేవా చేశారు ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్.
కాగా చైనాతోనే భారత్ పోటీ పడుతోందని, చైనా ఆర్థిక వ్యవస్థ 18 ట్రిలియన్ డాలర్లకు పైగా ఉందని పదే పదే నిర్మలా సీతారామన్ చెబుతూంటారు. మరి మన లక్ష్యం 5 ట్రిలియన్ డాలర్లు మాత్రమే ఎందుకు? అని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించిన విషయం తెలిసిందే.
మనకు అధిక శ్రామిక జనాభా, వనరులు చాలా ఉన్నప్పుడు మనం ఎందుకు ఉన్నత లక్ష్యాన్ని సాధించడం లేదని అంటూ కవిత నిలదీశారు.
Dynasts who nvr had to work their way up in life, always mock goals, ambitions n hard work
If India lags behind China tdy, it is bcoz decades of politics by likes of her father n other dynasts.
India is steadily growing its ambitions tdy,bcoz of PM @narendramodi #NewIndia https://t.co/mK8itRJGBu
— Rajeev Chandrasekhar 🇮🇳 (@Rajeev_GoI) February 16, 2023