యంగ్ రెబల్ స్టార్ రాముడిగా నటించిన ఆదిపురుష్ సినిమా టీజర్ విడుదలైనప్పటి నుంచి ఏదోక వివాదంలో చిక్కుకుంటూనే ఉంది. ముందు ఈ చిత్ర గ్రాఫిక్స్ పై సర్వత్రా తీవ్ర విమర్శలు వచ్చాయి. అందులోని పాత్రలు, వాటి వేషధారణలపై అభ్యంతరాలు వెల్లువెత్తాయి.
మీసాలు లేకుండా కేవలం గడ్డం, తోలు వస్త్రంతో హనుమంతుడి పాత్రని చూపించడం.. అలాగే రావణుడి పాత్రలో సైఫ్ అలీఖాన్ కనిపిస్తున్న తీరు పై నెటిజన్లు మండిపడుతున్నారు. మధ్యప్రదేశ్ లో హోమంత్రి నరోత్తమ్ మిశ్రా సైతం ఈ టీజర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
టీజర్ లో అభ్యంతరకరమైన సన్నివేశాలున్నాయని, ఇవి మతపరంగా కొందరి మనోభావాల్ని దెబ్బతీసే సన్నివేశాలని తొలగించాలని కోరారు. హిందూ పురాణ పురుషుల్ని తప్పుగా చూపించే సీన్లను తొలగించకపోతే చట్టపరమైన చర్యలు తీసకుంటామని హెచ్చరించారు.
అయితే ఇప్పుడు తాజాగా ఉతర్తప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి , బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ ఆదిపురుష్ టీజర్ పై మండిపడ్డారు. ఆ టీజర్ లో దేవుళ్ల పాత్రల్ని చూపించిన తీరు పై చాలా మంది సాధువులు అభ్యంతరం వ్యక్తం చేశారని, ఈ చిత్రాన్ని నిషేంధించాలని వాళ్లు చేస్తున్న డిమాండ్ న్యాయమైనదేనని అన్నారు.
హిందువుల మనోభావాలతో ఆడుకునే హక్కు ఏ ఒక్కరికీ లేదన్నారు. ఇందులో సైఫ్ ఆలీ ఖాన్ రావణుడి కంటే ఖిల్జీగా ఎక్కువగా కనిపిస్తున్నాడని అన్నారు. అలాగే హనుమంతు పాత్రకు మరీ గుర్తించలేనంతగా వక్రీకరించారని, ఇది ఏ మాత్రం సహించలేని విషయమని అన్నారు.
సినిమాటిక్ లిబర్టీలను అడ్డం పెట్టుకొని ఏమైనా చేయోచ్చని ఫిల్మ్ మేకర్స్ భావిస్తుంటారని కానీ ఇది ఏమాత్రం అంగీకరించమని తేల్చి చెప్పారు.ఇందులో భారతీయ సంస్కృతిని అపహాస్యం చేశారని మండిపడ్డారు. ఇదే సమయంలో సీత పాత్ర మీద కూడా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
ఆమె సీతాదేవి కన్నా సాధారణ హిందీ సినిమాల్లోని హీరోయిన్ లాగే కనిపిస్తోందని ఈ సినిమాని విడుదల చేయనివ్వమని కొన్ని హిందూ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.