మూడు రాజధానుల ప్రతిపాదన సరైందని కాదని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి తప్పుబట్టారు. రాజధానిని మార్చడం అంత తేలికైన వ్యవహారం కాదని..రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి పట్ల కేంద్రం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. సరైన సమయంలో కేంద్రం సరైన చర్యలు తీసుకుంటుందని ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. రాజు గారు మారినప్పుడల్లా రాజధానిని మార్చడం అంత తేలికైన వ్యవహారం కాదన్నారు. అసలు కమిటీ ఎక్కడ పర్యటించింది…ఏం నివేదిక ఇచ్చిందని సుజనా చౌదరి ప్రశ్నించారు. రాజధాని మార్పు విషయంలో కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చే సమస్యే ఉండదన్నారు. రాజధాని మార్పు విషయంపై త్వరలో కేంద్ర ప్రభుత్వ పెద్దలతో చర్చించనున్నట్టు సుజనా చౌదరి తెలిపారు.