• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News

Tolivelugu తొలివెలుగు - Latest Telugu Breaking News

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » National » ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము

ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము

Last Updated: June 21, 2022 at 10:14 pm

ఎన్డీఏ కూటమి తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము పేరు ఖరారైంది. ఆమెను తమ అభ్యర్థిగా ఎంపిక చేసినట్టు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. రాష్ట్రపతి ఎన్నికల కోసం మొత్తం 20 మంది పేర్లను బీజేపీ పార్టీ పరిశీలించింది. వారిలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేరు ప్రముఖంగా వినిపించింది.

ఈ క్రమంలో రాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసేందుకు బీజేపీ పార్లమెంటరీ బోర్డు నేడు సమావేశం అయింది. బీజేపీ నేతలతో పాటు, బీజేపీ మిత్రపక్షాలు రాష్ట్రపతి అభ్యర్థిపై సుదీర్ఘంగా ఆలోచనలు చేశాయి. చివరకు ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలోకి దింపుతున్నట్టు బీజేపీ నేతలు ప్రకటించారు.

ఆమె గతంలో జార్ఖండ్ గవర్నర్ గా పనిచేశారు. ఈ ఎన్నికల్లో ఆమె గెలిస్తే రాష్ట్రపతి పదవి చేపట్టిన తొలి ఆదివాసి వ్యక్తిగా ఆమె చరిత్ర సృష్టించనున్నారు. అంతేకాకుండా రాష్ట్రపతి పదవి చేపట్టిన రెండో మహిళగా ఆమె రికార్డు సృష్టించనున్నారు. అంతకు ముందు ప్రతిభా పాటిల్ రాష్ట్రపతిగా పని చేశారు.

రాష్ట్రపతి అభ్యర్థి రేసులో వెంకయ్యనాయుడు పేరు ప్రముఖంగా వినిపించింది. ఈ క్రమంలో వెంకయ్యనాయుడితో కేంద్ర హోం మంత్రి అమిత్ షా. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా భేటీ అయ్యారు.

Advertisements

రాష్ట్రపతి అభ్యర్థిగా ఆయన పేరు ఖరారైనట్టేనని అంతా భావించారు. కానీ అనూహ్యంగా ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. మరోవైపు విపక్షాలు తమ రాష్ట్రపతి అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హాను బరిలోకి దించుతున్నాయి.

tolivelugu news - follow on google news
tolivelugu app download


Primary Sidebar

తాజా వార్తలు

బీజేపీ టార్గెట్ చెప్పేసిన అమిత్ షా!

కృష్ణుడు ఆయ‌నే.. అర్జునుడు ఆయ‌నే..

ఆమె జీవితం అసాధారణమైంది

ఇదేం లెక్క.. బీజేపీకి 20 లక్షలు, టీఆర్ఎస్ కు 3 లక్షలు

ప‌విత్ర‌ను చెప్పుతో కొట్ట‌బోయిన న‌రేశ్ మూడో భార్య‌

తనపై వ్యాఖ్యలను ఖండించిన వంటల స్పెషలిస్ట్ యాదమ్మ

న‌డిచేందుకు బ‌ద్ధ‌కం… అందుకే ఈ వింత వాహ‌నం…

ముగిసిన ఎన్నిక…. ఆయనే నూతన స్పీకర్

బిజెపి అగ్రనేతలకు యాదమ్మ చేతి వంటకాలు

ఆకాశంలో ఈవెంట్లు చూద్దామా..!!

ఆయ‌న గురించా.. నాకు ఆ అర్హ‌త లేదు

మోడీ.. ప్రజలను ఆదుకోవడంలో సేల్స్ మెన్!

ఫిల్మ్ నగర్

ప‌విత్ర‌ను చెప్పుతో కొట్ట‌బోయిన న‌రేశ్ మూడో భార్య‌

ప‌విత్ర‌ను చెప్పుతో కొట్ట‌బోయిన న‌రేశ్ మూడో భార్య‌

ఆయ‌న గురించా.. నాకు ఆ అర్హ‌త లేదు

ఆయ‌న గురించా.. నాకు ఆ అర్హ‌త లేదు

'గార్గి' తో రాబోతున్న సాయి ప‌ల్ల‌వి...

‘గార్గి’ తో రాబోతున్న సాయి ప‌ల్ల‌వి…

ఇప్పటికైనా ఆగిపో ప్రభాస్.. ఫ్యాన్స్ విజ్ఞప్తి

ఇప్పటికైనా ఆగిపో ప్రభాస్.. ఫ్యాన్స్ విజ్ఞప్తి

శాటిలైట్ కు దారేది.. అయోమయంలో నిర్మాతలు

శాటిలైట్ కు దారేది.. అయోమయంలో నిర్మాతలు

ఆచార్య సినిమాపై పరుచూరి విశ్లేషణ

ఆచార్య సినిమాపై పరుచూరి విశ్లేషణ

పక్కా కమర్షియల్ మొదటి రోజు వసూళ్లు

పక్కా కమర్షియల్ మొదటి రోజు వసూళ్లు

ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోలు వీళ్లే

ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోలు వీళ్లే

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2022 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)