బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు కొత్త చట్టాలపై దేశవ్యాప్తంగా రైతులు ఉద్యమిస్తున్నారు. బీజేపీయేతర రాష్ట్రాల్లో కొన్ని చోట్ల ఆ చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలు తీర్మానం చేస్తున్నాయి. కేరళ రాష్ట్రంలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానాన్ని సీఎం పినరయి విజయన్ ప్రవేశపెట్టారు.
ఈ తీర్మానాన్ని కేరళ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. కేరళలో బీజేపీకి ప్రాతినిథ్యం వహిస్తున్న ఏకైక బీజేపీ ఎమ్మెల్యే రాజగోపాల్ సైతం బిల్లుకు మద్ధతు పలకటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది.
బిల్లును వ్యతిరేకించిన తర్వాత కూడా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కితీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల పక్షాన నిలిచిన ఎల్డీఎఫ్ ప్రభుత్వానికి తన మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూడీఎఫ్ కూడా మద్దతు ప్రకటించింది.
అయితే, సాయంత్రానికి ఎమ్మెల్యే ఓ.రాజగోపాల్ తను అలా అనలేదని, తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారంటూ ప్రకటన చేస్తూ లేఖ విడుదల చేశారు.