టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ఇటీవల హైదరాబాద్ లోని టీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించిన బీజేవైఎం నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. అందులో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్, పలువురు కార్యకర్తలపైనా కేసులు ఫైల్ అయ్యాయి.
అంతకుముందు పేపర్ లీక్ పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం నేతలు, కార్యకర్తలతో కలిసి ఆందోళన చేశారు. ఈ ఘటనలో ఆందోళన చేస్తున్న నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. మూడు, నాలుగు పోలీస్ స్టేషన్ లు తిప్పి పోలీసులు ఈ రోజు కేసులు నమోదు చేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో యువ మోర్చా అధ్యక్షులు భాను ప్రకాష్, యువ మోర్చా నాయకులపై ఐపీసీ సెక్షన్ 3 అండ్ 4,143,427,448,353, తో పాటు 149 సెక్షన్ల కింద కేసు నమోదైంది. అరెస్టు అనంతంర బీజేవై ఎం కార్యకర్తలను పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ హాస్పిటల్ తరలించారు. ఈ కేసులో 9 మంది బీజేవైఎం నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు.. వైద్య పరీక్షల అనంతరం చంచల్ గూడ జైలుకు రిమాండ్ కు తరలించారు.
అయితే ఈ ప్రశ్నాపత్రాల లీకేజీ వెనక పెద్ద కుట్ర దాగి ఉందని ఆరోపణలు వస్తున్నారు బీజేవై ఎం నేతలు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రవీణ్ కోసం ఆయన పరీక్ష రాసే కాలేజీకి ప్రత్యేకంగా పరీక్ష నిర్వహిస్తారా అని టీఎస్పీఎస్సీని విద్యార్థి సంఘాలు నిలదీస్తున్నారు. రెండు నెలల్లో జరిగే పరీక్షల పేపర్లు కేసీఆర్ టీమ్కు లీకయ్యాయని ఆరోపణలు చేస్తున్నారు. సింగరేణి పరీక్షా పత్రాలు కూడా లీకయ్యాయని ఆరోపణలు గుప్పించారు. ఉద్యోగాలు ఇవ్వలేక ఇంత దారుణాలకు ఒడిగడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.