బాలిక అత్యాచార ఘటనపై బీజేపీ శ్రేణులు సీబీఐ డిమాండ్ కు పట్టుబడుతున్నాయి. అసలు నిందితులను తప్పించారని వారిని అరెస్ట్ చేయాలంటూ ఆందోళనలు చేపడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా బీజేవైఎం ఆందోళనల బాట పట్టింది. బాలికకు న్యాయం చేయాలంటూ బీజేవైఎం అధ్యక్షుడు భానుప్రకాష్ హైదరాబాద్ లో నిరసన చేపట్టారు. పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి గోషామహల్ స్టేడియానికి తరలించారు.
Protest by @Bhanu4Bjp Anna (President, BJYM Telangana) & @BJYMinTS team at Jubilee Hills Checkpost against police inaction and demanding CBI Enquiry in the #JubileeHillsGangRape case.@KapilParmar @BJYM @bandisanjay_bjp pic.twitter.com/VJRA9EKmzC
— Sumiran Komarraju #HamaraAppNaMoApp (@SumiranKV) June 6, 2022
Advertisements
అసలు నిందితులను అరెస్ట్ చేయాలంటూ నిరహారదీక్షకు కూర్చున్నారు భాను ప్రకాష్. ఈ ఘటనలో హోంమత్రి మనవడి ప్రమేయం ఉందని.. అతడ్ని అరెస్ట్ చేసి కేసును సీబీఐకి అప్పగించేవరకు దీక్ష కొనసాగిస్తానని ప్రకటించారు. దీంతో ఉద్రిక్త వాతవరణం ఏర్పడింది. గోషామహల్ స్టేడియానికి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, రాజా సింగ్, ఈటెల రాజేందర్ రానున్నారు.
ఇటు ఈ కేసులో ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీజేవైఎం కార్యకర్తలు తెలంగాణ వ్యాప్తంగా రాస్తారోకోలు నిర్వహించారు. రాష్ట్రంలో మహిళలపై, బాలికలపై పెరుగుతున్న అఘాయిత్యాలు నియంత్రించాలని, జూబ్లీ హిల్స్ మైనర్ బాలిక అత్యాచార ఘటన కేసును సీబీఐకి అప్పగించాలని సికింద్రాబాద్ లో ధర్నా నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించిన బీజేవైఎం కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.
మేడ్చల్ లో రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేకంగా నిరసన తెలిపారు. రాష్ట్రంలో మహిళలపై ఘోరాలు పెరిగిపోతున్నాయని మండిపడ్డారు. వెంటనే మైనర్ బాలిక కేసును సీబీఐ చేత విచారణ చేయించాలని డిమాండ్ చేస్తూ రాస్తోరోకో నిర్వహించారు బీజేవైఎం నేతలు.
బోడుప్పల్ లో నడిరోడ్డుపై కూర్చొని నిరసన చేపట్టారు. కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీఆర్ఎస్ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శలు చేశారు.
మరోవైపు ముదస్తు అరెస్టులు కూడా కొనసాగాయి. తాండూరులో బీజేపీ, బీజేవైఎం నేతలను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. జూబ్లీహిల్స్ ఘటనలో నిందితులను అరెస్ట్ చేసి బాధితురాలికి సత్వర న్యాయం చేయాల్సిందిగా రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు మేరకు నిరసన చేపట్టేందుకు ప్రయత్నించగా పోలీసులు అరెస్ట్ చేశారు.