ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ దర్శకధీరుడు రాజమౌళిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క నెలలోనే ఒకే హీరోకు చెందని రెండు భారీ సినిమాలు విడుదల చేయటం సరైందికాదని, ఇప్పటికే రాజమౌళితో తను మాట్లాడినా… ఫలితం లేకుండా పోయిందని బోనీ కపూర్ ఓ ఇంటర్వ్యూలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
అజయ్ దేవగన్ హీరోగా బోనీ కపూర్ మైదాన్ అనే సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమా గతేడాదే రిలీజ్ కావాల్సి ఉన్నప్పటికీ కరోనా కారణంగా షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది. దీంతో 2021, అక్టోబర్ 15న విడుదల చేయాలని నిర్ణయించారు. మైదాన్ విడుదల తేదీ ఫిక్స్ అయిన తర్వాతే రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఆర్.ఆర్.ఆర్ లోనూ అజయ్ దేవగన్ ఓ కీలకపాత్ర చేస్తున్నారు. దీంతో ఒకే హీరోకు చెందిన రెండు భారీ ప్రాజెక్టులు రిలీజ్ చేస్తే ఇబ్బంది అంటూ తను రాజమౌళితో ఫోన్లో మాట్లాడానని, సినిమా రిలీజ్ విషయంలో తన ప్రమేయం లేదని చెప్పాడన్నారు.
కానీ తను రాజమౌళి మాటలు నమ్మటం లేదని… సినిమా రిలీజ్ డేట్ పై అజయ్ దేవగన్ కు కూడా చెప్పిఉండరని అనుకుంటున్నట్లు తెలిపాడు.