రియల్ ఎస్టేట్ కంపెనీలే లక్ష్యంగా ఆదాయం పన్ను అధికారులు హైదరాబాద్ లో మరోసారి దాడులు జరిపారు. తెలంగాణ హోంమంత్రి మహ్మద్ అలీ బంధువు అక్బర్ కు చెందిన గూగీ రియల్ ఎస్టేట్ సంస్థలో మంగళవారం ఐదు ప్రత్యేక బృందాలు సోదాలు జరిపాయి.
దిల్ సుఖ్ నగర్, కొత్తపేటలోని గూగీ రియల్ ఎస్టేట్ హెడ్ ఆఫీస్ లో ఐటీ అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేశారు. గూగీ రియల్ ఎస్టేట్ సంస్థ వేర్వేరు చోట్ల రాయల్ సిటీ, వండర్ సిటీ, ఫార్మా సిటీ పేర్లతో పలు ప్రాజెక్ట్ లు నిర్మిస్తోన్నట్లు సమాచారం.
ఇక మరికొన్ని ఐటీ అధికారుల బృందాలు కంపెనీ డైరెక్టర్ల ఇళ్లల్లోనూ రైడ్స్ నిర్వహిస్తున్నాయి. హైదరాబాద్ లో ఐటీ అధికారులు మొత్తం 20 చోట్ల దాడులు నిర్వహిస్తున్నాయి.