ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థులు దేశపతి శ్రీనివాస్, నవీన్ కుమార్, చల్లా వెంకట్రామిరెడ్డి తమ నామినేషన్ పత్రాలను అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులకు సమర్పించారు.
ఈ కార్యక్రమానికి మంత్రులు హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి,తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. నామినేషన్ల దాఖలు కంటే ముందు ఎమ్మెల్సీ అభ్యర్థులు గన్ పార్కులోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు.
ఈ ఏడాదితో శాసనమండలిలో గంగాధర్ గౌడ్, నవీన్ కుమార్, ఎలిమినేటి కృష్ణారెడ్డి పదవీ కాలం ముగుస్తుండడంతో..వీరి కోటాలో అనగా ఎమ్మెల్యే కోటాలో ఎన్నికకు ఫిబ్రవరి 27న నోటిఫికేషన్ విడుదలైంది. నేటి నుంచి మార్చి 13 వరకు ఈ ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ ఎన్నికకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ స్వీకరించిన నామినేషన్లను 14 వ తేదీన పరిశీలించనున్నారు.
నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు ఈనెల 16వ తేదీ వరకు సమయం ఇచ్చారు. ఉపసంహరించుకున్న నామినేష్ల తర్వాత వారం రోజుల సమయంలో మార్చి 23న ఎమ్మెల్సీ ఎన్నికకు పోలింగ్ జరగనుంది. ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించి.. అదే రోజు ఓట్లను లెక్కించనున్నారు.