బీఆర్ఎస్ నాయకుడు, మాజీ డిప్యూటీ సీఎం, మంత్రి, ప్రస్తుతం స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తాటికొండ రాజయ్య మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. మంత్రి పదవి పోయినప్పట్నుంచి నియోజక వర్గంలో ఏదో విషయంలో విమర్శలు ఎదుర్కొంటూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇక రాజయ్య రీసెంట్ గా ఓ లేడీ సర్పంచ్ పై మనసు పడ్డానంటూ మరో బీఆర్ఎస్ నాయకుడితో రాయబారం చేయడంపై సదరు మహిళా సర్సంచ్ తన గోడును స్వయంగా సీఎం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించుకుంది.
ఈ వార్త ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ విషయంపై ఇప్పటి జానకీపురం సర్పంచ్ నవ్య మీడియా ముందుకొచ్చారు. తనను బీఆర్ఎస్ నాయకుడు పెడుతున్న లైంగిక, మానసిక వేధింపులపై ఘాటు ఆరోపణలు చేశారు. షాపింగ్ పేరుతో తనతో బయటకు వస్తే బంగారం, డబ్బులతో పాటు తన పిల్లల చదువులకు అయ్యే ఖర్చు కూడా తానే భరిస్తానంటూ ప్రలోభపెడుతున్నారని.. అన్నారు.
తననే కాదు మండలంలోని మరికొందరు మహిళా ప్రజాప్రతినిధుల పట్ల కూడా ఇదే విధంగా వ్యవహరిస్తున్నారంటూ కన్నీరు పెట్టుకుంది సర్పంచ్ నవ్య. అయితే రాజయ్యకు వివాదాలు కొత్త కాదు. ఆయన గతంలో ఓ మహిళా నాయకురాలిపై చేయి వేసినట్లు, కేక్ తినిపించినట్లుగా వీడియో, ఫోటోలు వైరల్ అయ్యారు. దీంతో ఆయనకు కొంటె ఎమ్మెల్యేగా పేరు పడింది.
అయితే ఈ సారి మాత్రం జానకీపురం సర్పంచ్ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ను కలిసి ఈ విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్తానని చెబుతున్నారు. తాను కేవలం ప్రజా సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని ఆమె ఎమ్మెల్యే రాజయ్యకు ఘాటుగా బదులిస్తున్నారు.