బీజేపీ సర్కార్ పై ఎమ్మెల్సీ కవిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో నిరుద్యోగం గురించి ఆమె ట్వీట్ చేశారు. ప్రస్తుతం నిరుద్యోగ రేటు 7.8 శాతంగా వుందని పేర్కొన్నారు. ఇది మూడు నెలల గరిష్ఠ స్థాయి అంటూ వెల్లడించారు.
ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు కదా ఆ హామీ ఏమైంది? అని ప్రశ్నించారు. మోసపూరిత హామీతో యువతను కూడా దగా చేశారు అని మండిపడ్డారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న పది లక్షల ఉద్యోగాలను ఎప్పుడు భర్తీ చేస్తారని నిలదీశారు కవిత.
ఆ ఉద్యోగాలను భర్తీ చేసే ఉద్దేశం కనిపించడం లేదని ఎద్దేవ చేశారు. దేశంలో ఈరోజు వాస్తవం ఏంటంటే నిజమైన డిగ్రీ ఉన్నవాళ్లకు ఉద్యోగాలు లేవని.. కానీ, డిగ్రీ లేని వ్యక్తికి అత్యున్నతమైన ఉద్యోగం ఉందని చురకలంటించారు.
యువత పట్ల ఏమైనా ఆందోళన ఉందా? లేదా? అంటూ ప్రశ్నలు గుప్పించారు. యువత శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకునే ఆలోచన ఉందా? లేదా? అంటూ బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీశారు కవిత.