బడ్జెట్ సెంటిమెంట్ స్టాక్ మార్కెట్లు సూచీలను పరుగులు పెట్టించింది. మదుపర్లకు భారీ లాభాలు తెచ్చిపెట్టింది. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సెన్సెక్స్ 848 పాయింట్లు లాభపడి 58,863 వద్ద స్థిరపడింది.
ఉదయం 58,672 పాయింట్ల వద్ద భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. మిడ్ సెషన్ వరకు లాభాలతో కొనసాగాయి. ఓ దశలో 59,032 వద్ద సెన్సెక్స్ గరిష్ఠాన్ని చేరింది. అయితే.. బడ్జెట్ ప్రసంగం మొదలైన తరువాత కొద్దిసేపు ఒడుదొడుకులకు లోనై 57,737 పాయింట్ల వద్ద కనిష్ఠ స్థాయిని తాకింది. తరువాత మళ్లీ లాభాల వైపు పయనించింది. చివరకు సెన్సెక్స్ 848 పాయింట్ల లాభంతో 58,863 వద్ద స్థిరపడింది.
అటు, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి నిఫ్టీ కూడా లాభాల బాటపట్టింది. 237 పాయింట్ల పైకి పాకి 17,577 వద్ద ముగిసింది. సెషన్ 17,529 వద్ద లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 17,622 పాయింట్ల గరిష్ఠానికి చేరి.. 17,244వద్ద కనిష్ఠాన్ని తాకింది.
Advertisements
సెన్సెక్స్ 30 ప్యాక్లో టాటా స్టీల్, సన్ ఫార్మా, అల్ట్రాటెక్ సిమెంట్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎల్ అండ్ టీ లాభాలతో సెషన్ ముగించగా.. రిలయన్స్, ఎన్టీపీసీ, మారుతీ సుజుకీ, డాక్టర్ రెడ్డీస్, ఎస్బీఐ, ఎం అండ్ ఎం, పవర్ గ్రిడ్ నష్టాలు చవిచూశాయి.