ఏపీలో బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్దం అయింది. అందుకు ముహూర్తం ఖరారు చేసింది ప్రభుత్వం. మార్చి 7 నుండి ఆ నెలాఖరు వరకు ఈ సమావేశాలను నిర్వహించనున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
సుమారు 15 నుంచి 20 రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో.. తొలిరోజున దివంగత నేత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి మృతి పట్ల అసెంబ్లీ సంతాపం వ్యక్తం చేయనుంది. మార్చి 8న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగించనున్నట్టు వెల్లడించారు.
మార్చి 11 లేదా 14న అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. రూ.2.30 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్ ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
బడ్జెట్ రూపకల్పనపై ఆర్థిక శాఖ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. త్వరలోనే అందుకు సంబందించిన ప్రక్రియ పూర్తి కానుంది. కాగా.. ప్రస్తుత బడ్జెట్ లో విద్య, వైద్య రంగాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.