కేంద్ర బడ్జెట్ లో వ్యవసాయానికి కేటాయింపులు తక్కువగా ఉన్నాయని ఏపీ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. బుధవారంనాడు ఏపీ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కేంద్ర బడ్జెట్ ట్ పై మీడియాతో మాట్లాడారు.ఆదాయపు పన్ను శ్లాబా్ రేట్లు ఊరటనిచ్చాయన్నారు. కొన్ని కేటాయింపులు సంతృప్తినిచ్చినట్టుగా ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు.
రైల్వేలు, రోడ్లలో మౌలిక వసతులపై బడ్జెట్ లో అధిక నిధులు కేటాయించినట్టుగా ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. వ్యవసాయం, పౌరసరఫరాలపై కేటాయింపులు తగ్గినట్టుగా కన్పిస్తుందన్నారు. ఏడు ముఖ్యమైన అంశాలకు బడ్జెట్ లో కేటాయింపులు చేసినట్టుగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారని ఆయన గుర్తు చేశారు.
గతేడాది బడ్జెట్ మూల ధన వ్యయం రూ.7.28 లక్షలు ఉండగా, ఈసారి రూ.10 లక్షలకు పెరిగినట్టు బడ్జెట్ లో చెప్పారని బుగ్గన వివరించారు.గతేడాది 6.4 శాతం ద్రవ్యలోటు ఉండగా, ఇప్పుడది 5.9 శాతానికి తగ్గినట్టు కనిపిస్తోందని తెలిపారు. ఇది శుభపరిణామం అని అన్నారు. అయితే పలు రంగాల్లో కేటాయింపులు తగ్గినట్టు కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు.
యూరియా సబ్సిడీ, వ్యవసాయపరమైన సబ్సిడీలు తగ్గినట్టు కనిపిస్తున్నాయని బుగ్గన వెల్లడించారు. గతేడాది యూరియా సబ్సిడీ రూ.1.54 లక్షల కోట్లు ఉండగా, ఈసారి ఆ సబ్సిడీ రూ.1.31 లక్షల కోట్లు కేటాయించినట్టు తెలుస్తోందని వివరించారు.
అదే సమయంలో రైల్వే బడ్జెట్ కేటాయింపులు బాగున్నాయని, గతేడాది రూ.1.89 లక్షల కోట్లు కేటాయించగా, ఈసారి రూ.2 లక్షల కోట్లకు పైగా కేటాయించారని చెప్పారు. రైల్వే స్టేషన్ల వసతులకు పెద్దపీట వేసినట్టు కనిపిస్తోందని అన్నారు. వ్యవసాయం, పౌరసరఫరాలకు కేటాయింపులు తగ్గినట్టు భావిస్తున్నామని బుగ్గన తెలిపారు. రోడ్లు, రైల్వేల మౌలిక వసతుల కోసం భారీగా కేటాయించినట్టు అర్థమవుతోందని బుగ్గన వెల్లడించారు.