వికారాబాద్ జిల్లా అడువుల్లో బుల్లెట్ లభించటం కలకలం రేపుతోంది. యాలాల మండలం మండల్పూర్లో బుల్లెట్, మాగ్జైన్ లభించాయి. అడవిలో పశువులను మేపడానికి వెళ్లిన పశువుల కాపర్లకు కనిపించడంతో సర్పంచ్కు సమాచారం అందించారు. దీంతో అధికారులు రంగంలోకి దిగారు.
సర్పంచ్ ఇచ్చిన సమాచారంతో అటవీశాఖ అధికారులు, పోలీసులు అడవి ప్రాంతంలోకి వెళ్లి… బుల్లెట్, మాగ్జైన్ను స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా అడవిలో వేటకు వచ్చి వదిలి వెళ్లారా? లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కొంతకాలంగా అడవిలో వేట కొనసాగుతుందని స్థానికులు ఆరోపిస్తున్న నేపథ్యంలో బుల్లెట్ దొరకటం స్థానికంగా సంచలనంగా మారింది.