బండి సంజయ్కి నిరుద్యోగుల గురించి మాట్లాడే హక్కు లేదని ఆయన మండిపడ్డారు మంత్రి హరీష్రావు. ప్రభుత్వ రంగ సంస్థలు మూసివేస్తూ ఉద్యోగాలు తీసివేస్తోందని కేంద్రంపై నిప్పులు చెరిగారు. దేశంలో 15 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని.. వాటిని వెంటనే భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వెంటనే సీసీఐ పునరుద్దరించాలని అన్నారు. ఉద్యోగాలను భర్తీ చేయకుండా కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆరోపించారు.
ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మడం, మూసివేయడం వల్ల రిజర్వేషన్ వర్గాలకు ఉద్యోగాలు దక్కడం లేదని అన్నారు. రాబోయే రోజులలో తెలంగాణలో ఖాళీగా యాబై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అన్నారు.
Advertisements
కేంద్రం సీసీఐ పునప్రారంభిస్తే కొత్త పరిశ్రమకు ఇచ్చే రాయితీలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ముగియగానే పెట్రోల్ ధరలు మళ్లీ పెంచుతారని.. ఆర్టీసీ పై మోపిన డీజీల్ ధరలు తగ్గించాలని మంత్రి కోరారు.