కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఎంతగానో సతమతమయ్యారు. అయితే, ఇప్పుడిప్పుడే కరోనా తగ్గిపోతుందేమోనని అనుకునేలోగా మరో కొత్త వేరియంట్ వ్యాప్తి కలకలం సృష్టిస్తోంది. ఈ వేరియంట్ అత్యంత వేగంగా వ్యాపిస్తుండటంతో అన్ని దేశాల్లో కరోనా కలకలం మొదలైంది. కరోనా సరికొత్త రూపం ఎక్స్ఈని మొదటిసారిగా యునైటెడ్ కింగ్డమ్లో గుర్తించగా.. ఇప్పుడు ఇండియాకు కూడా పాకింది.
ఈ నేపథ్యంలో కోవిడ్ వర్కింగ్ గ్రూపు ఛైర్మన్ ఎన్కే అరోరా స్పందించారు. ఒమిక్రాన్ వల్లే కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకువస్తున్నాయని ఆయన అన్నారు. ఎక్స్ఈ లాంటి సిరీస్లో అదో ఎక్స్ వేరియంట్లా పనిచేస్తోందన్నారు. అయితే ఒమిక్రాన్ వల్ల కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకు వస్తూనే ఉంటాయన్నారు. ప్రస్తుతం ఇండియాలో అందుబాటులో ఉన్న డేటా ప్రకారం.. ఒమిక్రాన్ వేరియంట్ మరీ అంత వేగంగా వ్యాప్తి కావడం లేదని ఆరోరా తెలిపారు.
కాగా, కాగా, దేశంలో తొలి ఎక్స్ఈ కేసు ముంబైలో గుర్తించారు. ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఓ మహిళలో ఈ వేరియంట్ను గుర్తించారు. తాజాగా గుజరాత్లోనూ తొలి ఒమిక్రాన్ ‘ఎక్స్ఈ’ కేసు నమోదైనట్లు ఆరోగ్య శాఖ అధికారిక వర్గాలు తెలిపాయి. మిగిలిన కరోనా వేరియంట్ల కంటే ఎక్కువ వేగంగా విస్తరించే గుణం దీనికి ఉందని నిపుణులు అంటున్నారు.
ఒమిక్రాన్లోని రెండు సబ్ వెర్షన్లు బీఏ.1, బీఏ.2 కలిసి ఎక్స్ఈ వేరియంట్గా రూపాంతరం చెందాయి. తొలిసారిగా యూకేలో బయటపడిన ఈ వేరియంట్.. ఆ తర్వాత పలు దేశాలకు వ్యాపించింది. దీని వ్యాప్తి వేగం ఒమిక్రాన్ కంటే 10 రెట్లు ఎక్కువ కావడంతో కేసులు పెరిగే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ప్రాణాంతకమైన తీవ్ర లక్షణాలు ఉండకపోవచ్చని సమాచారం.
అలాగే, దేశంలో కరోనాను అంతం చేయడానికి తాజాగా 18 ఏళ్ల పైబడినవారి బూస్టర్ డోస్ను ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పెరుగుతున్న కరోనా కేసుల నియంత్రణకు ఎప్పటికప్పుడు రాష్ట్రాలను అప్రమత్తం చేస్తోంది.
Omicron giving rise to many new variants. It is of X series like XE & others. These variants will keep on occurring. Nothing to panic about… At the moment from Indian data it doesn’t show a very rapid spread: NK Arora, Chairman, Covid working group NTAGI pic.twitter.com/fu5E3QmdoJ
— ANI (@ANI) April 11, 2022
Advertisements