ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్, నంది గ్రెయిన్ డెరివేటివ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ మేరకు కంపెనీ డైరెక్టర్లు సురేష్ కుమార్ శాస్త్రి, సజ్జల శ్రీధర్ రెడ్డి, శశిరెడ్డి పై కేసు ఫైల్ అయింది. బ్యాంక్ ఆఫ్ బరోడా ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేసింది సీబీఐ. తప్పుడు పత్రాలతో రుణాలు పొంది ఎగవేశారని బీఓబీ ఫిర్యాదు చేసింది.
ఎస్పీవై రెడ్డి సహా పలువురు మోసం చేశారని సీబీఐకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. మొత్తం రూ.61.86 కోట్ల నష్టం కలిగిందని సీబీఐకి బ్యాంక్ ఆఫ్ బరోడా ఫిర్యాదు చేసింది.