జగన్ ఆస్తుల కేసులో మరో రెండు ఛార్జిషీట్లు దాఖలు చేసింది ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఇప్పటివరకు నమోదైన వాటి ఆధారంగా విచారణ జరిపిన ఈడీ.. వాన్ పిక్, లేపాక్షి నాలెడ్జ్ హబ్ కేసులకు సంబంధించి కూడా రెండు ఛార్జిషీట్లు కోర్టుకు సమర్పించింది.
మనీలాండరింగ్ అభియోగాలతో ఈ ఛార్జిషీట్లు దాఖలయ్యాయి. ఇప్పటి వరకు దాఖలు చేసిన 11 ఛార్జిషీట్ల ఆధారంగా దర్యాప్తు జరుపుతున్న ఈడీ.. ఇప్పటికే ఏడింటిని కోర్టుకు సమర్పించింది. తాజాగా మరో రెండింటిని దాఖలు చేసింది. కోర్టు వీటిని పరిగణనలోకి తీసుకుంటే నిందితులకు సమన్లు జారీ అయ్యే అవకాశముంది.