• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Local News » Andhra Pradesh » వైఎస్ వివేకా హత్య కేసు… విచారణ మార్చి 10కి వాయిదా..!

వైఎస్ వివేకా హత్య కేసు… విచారణ మార్చి 10కి వాయిదా..!

Last Updated: February 10, 2023 at 7:23 pm

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసుపై ఈ రోజు సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో వాదనలు విన్న కోర్టు కేసును వచ్చే నెల 10వ తేదీకి వాయిదా వేసింది. మొదట ఈ కేసు నిందితుడు ఉమాశంకర్ రెడ్డి ఆలస్యంగా రావడంతో కేసును ఆయన వచ్చే వరకు వాయిదా వేశారు.

ఈ కేసులో నిందితులను కడప నుంచి హైదరాబాద్ కు తీసుకు వచ్చారు. అయితే నిందితుడు ఉమాశంకర్ రెడ్డి వాహనం ట్రాఫిక్‌లో ఆగిపోయింది. ఈ నేపథ్యంలో మిగిలిన నిందితులను కోర్టులో హాజరు పరచలేదు. దీంతో కేసును కోర్టు కొంత సేపు వాయిదా వేసింది.

ఉమాశంకర్‌రెడ్డి వచ్చిన తర్వాత న్యాయస్థానం విచారణ ప్రారంభించింది. అనంతరం తదుపరి విచారణను వచ్చేనెల 10కి వాయిదా వేస్తున్నట్టు కోర్టు పేర్కొంది. నిందితుల్లో శివశంకర్‌రెడ్డి, ఉమాశంకర్‌రెడ్డి, సునీల్‌యాదవ్‌ ఇప్పటికే కడప జైలులో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్నారు. దీంతో వారిని చంచల్‌గూడ జైలుకు తరలించాలని న్యాయమూర్తి ఆదేశించారు.

మరో ఇద్దరు నిందితులు ఎర్ర గంగిరెడ్డి, అప్రూవర్‌గా మారిన దస్తగిరి బెయిల్‌పై బయట ఉన్నారు. ఈ కేసులో ప్రధాన, అనుబంధ ఛార్జిషీట్‌లను ఇటీవల సీబీఐ కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ క్రమంలో కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న నిందితులకు న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 10న విచారణకు రావాలంటూ వారిని ఆదేశింది.

కొద్ది రోజుల క్రితం వివేకా హత్య కేసు విచారణను ఏపీ నుంచి తెలంగాణకు సుప్రీంకోర్టు బదిలీ చేసింది. కేసు బదిలీ నేపథ్యంలో హత్యకు సంబంధించి కడప జిల్లా సెషన్స్ కోర్టులో ఉన్న అన్ని ఫైళ్లు, ఛార్జ్ షీట్లు, సాక్షుల వాంగ్మూలాలు, దస్త్రాలను 3 బాక్సుల్లో హైదరాబాద్ ప్రిన్సిపల్ సీబీఐ కోర్టుకి ఇప్పటికే తీసుకొచ్చారు.

Primary Sidebar

తాజా వార్తలు

పుష్ప-2 ఓటీటీ రైట్స్ కి బేరం షురూ….ఎంతో తెలుసా…. !?

నేను నటనవైపు రావడం అమ్మానాన్నలకు అస్సలు ఇష్టం లేదు..!

‘’ఎన్టీఆర్ 30” సెట్స్ లోకి ఎంటరైన ఎన్టీఆర్…వీడియో వైరల్ ..!

ఫ్యామిలీతో సమ్మర్ వెకేషన్ కి వెళ్ళిన పవన్ …!

కోదండరామ్ కు బిగ్ షాక్.. కీలక నేత రాజీనామా

రజనీకాంత్ కూతురి పిసినారి తనాన్ని 18 ఏళ్లుగా చూస్తున్నా..! : పనిమనిషి

సినిమాల్లో తెలంగాణ యాస‌.. కేటీఆర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

హరిత హారంలో పెంచిన 150 మొక్కలను నరికేశాడు…!

నగరంలో ఐపీఎల్ ఫీవర్.. క్రికెట్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ లు

ఇది కలెక్షన్ల “దసరా’… తెరకెక్కించిన తీరును ప్రసంసిస్తున్న ప్రముఖులు..!

ప్రజలకు మరో షాక్.. సైలెంట్ గా చార్జీలు పెంచేసిన టీఎస్ఆర్టీసీ

దీపిక అటు …రణవీర్ ఇటు ఇద్దరి మధ్యా ఎనీ ఇష్యూస్…!?

ఫిల్మ్ నగర్

పుష్ప-2 ఓటీటీ రైట్స్ కి బేరం షురూ....ఎంతో తెలుసా.... !?

పుష్ప-2 ఓటీటీ రైట్స్ కి బేరం షురూ….ఎంతో తెలుసా…. !?

నేను నటనవైపు రావడం అమ్మానాన్నలకు అస్సలు ఇష్టం లేదు..!

నేను నటనవైపు రావడం అమ్మానాన్నలకు అస్సలు ఇష్టం లేదు..!

‘’ఎన్టీఆర్ 30” సెట్స్ లోకి ఎంటరైన ఎన్టీఆర్...వీడియో వైరల్ ..!

‘’ఎన్టీఆర్ 30” సెట్స్ లోకి ఎంటరైన ఎన్టీఆర్…వీడియో వైరల్ ..!

ఫ్యామిలీతో  సమ్మర్   వెకేషన్ కి   వెళ్ళిన  పవన్ ...!

ఫ్యామిలీతో సమ్మర్ వెకేషన్ కి వెళ్ళిన పవన్ …!

రజనీకాంత్ కూతురి పిసినారి తనాన్ని 18 ఏళ్లుగా చూస్తున్నా..! : పనిమనిషి

రజనీకాంత్ కూతురి పిసినారి తనాన్ని 18 ఏళ్లుగా చూస్తున్నా..! : పనిమనిషి

ktr-happy-to-rrr-oscar-winning-.jpg

సినిమాల్లో తెలంగాణ యాస‌.. కేటీఆర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

ఇది కలెక్షన్ల “దసరా’... తెరకెక్కించిన తీరును ప్రసంసిస్తున్న ప్రముఖులు..!

ఇది కలెక్షన్ల “దసరా’… తెరకెక్కించిన తీరును ప్రసంసిస్తున్న ప్రముఖులు..!

దీపిక అటు ...రణవీర్ ఇటు ఇద్దరి మధ్యా ఎనీ ఇష్యూస్...!?

దీపిక అటు …రణవీర్ ఇటు ఇద్దరి మధ్యా ఎనీ ఇష్యూస్…!?

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap