అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు మినహాయింపునకు ఏపీ సీఎం వైఎస్ జగన్ పెట్టుకున్న అభ్యర్థనపై సీబీఐ కోర్టు తుది తీర్పు వెల్లడించింది. వ్యక్తి గత హాజరు నుండి మినహాయింపు పిటిషన్ ను డిస్మిస్ చేసిన సీబీఐ కోర్టు. మీరు రావాల్సిందే అని జగన్ కు సిబిఐ కోర్టు తేల్చి చెప్పేసింది.
ఏపీ రాష్ట్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రిగా కీలకమైన బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉన్నందున ప్రతీ శుక్రవారం విచారణకు తన బదులుగా న్యాయవాది హాజరయ్యేలా అనుమతివ్వాలని జగన్ అప్పీల్ చేసుకున్నారు. సీబీఐ న్యాయస్థానంలో గత నెల 18న ఇరువైపుల వాదనలు ముగిశాయి.
విజయవాడ నుంచి హైదరాబాద్లోని కోర్టుకు హాజరు కావడానికి సుమారు రెండు రోజులు పడుతోందన్నారు. రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా తాను ఎక్కువ సమయం ఏపీలోనే కేటాయించాల్సి వస్తుందని జగన్ తరుపు న్యాయవాది వాదించారు. మరోవైపు జగన్ అభ్యర్థనపై సీబీఐ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇప్పటికే కేసు విచారణకు తీవ్ర జాప్యం జరుగుతోందని. ఇప్పుడు సీఎం జగన్కు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునిస్తే కేసు విచారణ మరింత ఆలస్యం అవుతుందని సిబిఐ పేర్కొంది.
సీఎం జగన్ రాజకీయ, ధన, అర్ధ, అంగ బలంతో సాక్షులను తీవ్రంగా ప్రభావితం చేసే ప్రమాదం పొంచి ఉందంటూ ఆరోపించింది.
చట్టం ముందు అందరూ సమానులేనని. సీఎం అయినంత మాత్రాన. వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వొద్దని సీబీఐ బలంగా వాదనలు వినిపించింది. గతంలో ఇదే అభ్యర్థనపై జగన్ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసినందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. సిబిఐ లాయర్ల వాదనతో ఏకీభవించిన సిబిఐ న్యాయస్థానం జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటిషన్ని కొట్టిపాడేసింది.