• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News

Tolivelugu తొలివెలుగు - Latest Telugu Breaking News

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Top Stories » ఫోక్స్‌వ్యాగన్ కేసులో బొత్సకు సీబీఐ కోర్టు సమన్లు

ఫోక్స్‌వ్యాగన్ కేసులో బొత్సకు సీబీఐ కోర్టు సమన్లు

Last Updated: August 23, 2019 at 11:12 am

హైదరాబాద్‌: ‘సొమ్ములు పోనాయండీ.. మనమేటి సేత్తాం..’ అనేది బొత్స సత్యనారాయణ కాపీరైట్ డైలాగ్. ఇప్పుడు ఆ సొమ్ములు పోయిన కేసులోనే బొత్స సత్యనారాయణకు సీబీఐ కోర్టు సమన్లు పంపింది.

botsa satyanarayana

వివరాల్లోకి వెళ్తే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో జరిగిన ఫోక్స్‌ వ్యాగన్‌ కేసు వ్యవహారంలో ఏపీ పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణకు సమన్లు వచ్చాయి. హైదరాబాద్‌ నాంపల్లి సీబీఐ కోర్టు మంత్ర సత్యనారాయణకు సమన్లు జారీచేసింది. వచ్చే నెల 12వ తేదీన న్యాయస్థానానికి హాజరుకావాలని ఆదేశించింది. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయంలో బొత్స సత్యనారాయణ పరిశ్రమల శాఖకు మంత్రిగా ఉన్నారు. ఫోక్స్‌వ్యాగన్‌ కేసులో ఆయనే ముఖ్య సాక్షి.
జర్మనీకి చెందిన ఫోక్స్‌వ్యాగన్‌ సంస్థ విశాఖపట్నంలో తమ పరిశ్రమ ఏర్పాటు చేస్తామని చెప్పి అప్పట్లో పలువురు రాష్ట్ర ప్రభుత్వాన్ని మోసం చేశారని అభియోగం. దీనిపై కేసు నమోదయ్యింది. వశిష్ఠ వాహన్‌ మాజీ అధికారి హెల్మంత్, అశోక్‌కుమార్‌ జైన్, వశిష్ఠ వాహన్‌ డైరెక్టర్లు జగదీశ్ అలగ్‌రాజా, గాయిత్రీరాయ్‌, వీకే చతుర్వేది, జోసఫ్ వీ జార్జ్‌ ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. 2010లో నాంపల్లి సీబీఐ కోర్టులో దాఖలయిన ఛార్జ్‌షీట్‌ ఆధారంగా కేసు విచారణ కొనసాగుతోంది. ఇందులో భాగంగా మంత్రి బొత్స సత్యనారాయణ వాంగ్మూలం అవసరం పడింది. అందుకే సమన్లు జారీచేశారు. వాంగ్మూలం నమోదుకోసం సెప్టెంబర్‌ 12న బొత్స సత్యనారాయణ నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరు కావాల్సివుంది.

tolivelugu news - follow on google news
tolivelugu app download


Primary Sidebar

తాజా వార్తలు

30న పీఎస్ఎల్వీసీ 53 ప్ర‌యోగం..

జుబైర్ కు మ‌రో 4 రోజుల క‌స్ట‌డీ..

ఆస్తి కోసం న‌ర‌బ‌లి..

ఎక్స్ క్లూజివ్.. పక్కా కమర్షియల్ సెన్సార్ టాక్

చీపురుని కాలుతో ఎందుకు తొక్కకూడదు…? చీపురు ఎక్కడ పెడితే మంచిది..?

బాహుబలిలో అనుష్క లాంటి పాత్రలు కావాలి

ఆ పాన్ ఇండియా సినిమా పోస్ట్ పోన్ అయింది

సమంత సినిమా కూడా వాయిదా

జియో డైరెక్ట‌ర్ గా త‌ప్పుకున్న ముఖేష్ అంబానీ..

మెగా ప‌వ‌ర్ స్టార్ ఇంటికి బాలీవుడ్ స్టార్స్‌..విష‌యం ఏంటంటే..?

సముద్రంపై అదుపుత‌ప్పిన హెలికాఫ్ట‌ర్‌..న‌లుగురి మృతి

30న తెలంగాణ టెన్త్ ఫ‌లితాలు..

ఫిల్మ్ నగర్

ఎక్స్ క్లూజివ్.. పక్కా కమర్షియల్ సెన్సార్ టాక్

ఎక్స్ క్లూజివ్.. పక్కా కమర్షియల్ సెన్సార్ టాక్

బాహుబలిలో అనుష్క లాంటి పాత్రలు కావాలి

బాహుబలిలో అనుష్క లాంటి పాత్రలు కావాలి

ఆ పాన్ ఇండియా సినిమా పోస్ట్ పోన్ అయింది

ఆ పాన్ ఇండియా సినిమా పోస్ట్ పోన్ అయింది

సమంత సినిమా కూడా వాయిదా

సమంత సినిమా కూడా వాయిదా

మెగా ప‌వ‌ర్ స్టార్ ఇంటికి బాలీవుడ్ స్టార్స్‌..విష‌యం ఏంటంటే..?

మెగా ప‌వ‌ర్ స్టార్ ఇంటికి బాలీవుడ్ స్టార్స్‌..విష‌యం ఏంటంటే..?

అవే నా కెరీర్ ను దెబ్బ‌తీశాయి: పూజా హెగ్డే

అవే నా కెరీర్ ను దెబ్బ‌తీశాయి: పూజా హెగ్డే

నాగార్జున, మహేష్ బాబు ఇండస్ట్రీలోకి రావటానికి ఎన్టీఆర్ కారణమట! ఎలానో తెలుసా ?

నాగార్జున, మహేష్ బాబు ఇండస్ట్రీలోకి రావటానికి ఎన్టీఆర్ కారణమట! ఎలానో తెలుసా ?

చిరంజీవి-మారుతి.. ఎక్స్ క్లూజిక్ డీటెయిల్స్

చిరంజీవి-మారుతి.. ఎక్స్ క్లూజిక్ డీటెయిల్స్

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2022 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)