చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్కు సీబీఐ అధికారులు నోటీసులిచ్చారు. ఈ నెల 6న సీబీఐ ఎదుట విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. గతంలో కోర్టులు, జడ్జిలను విమర్శించిన కేసులో ఆమంచి కృష్ణమోహన్కు సీబీఐ నోటీసులిచ్చింది.
కొన్ని తీర్పులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తుండటంతో… గతంలో న్యాయస్థానానికి దురుద్దేశాలను ఆపాదిస్తూ, న్యాయమూర్తులను దూషిస్తూ, వారిని ముక్కలుగా నరకాలి అని హెచ్చరిస్తూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెట్టారు. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కూడా జడ్జిలకు దురుద్దేశాలను ఆపాదించారు. వీరికి కోర్టు ధిక్కరణ కింద నోటీసులు జారీ చేసింది.
గ్రామ సచివాలయాలకు వైసీపీ రంగులు, డాక్టర్ సుధాకర్ కేసుల్లో తీర్పు తర్వాత… అధికార పార్టీ నేతలు నేరుగా కోర్టులను, జడ్జిలను విమర్శించారు.