మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు రోజు రోజుకూ ఆసక్తికరంగా మారుతోంది. ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో భాగంగా ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేసే విషయం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.
తాజాగా గురువారం సీబీఐ అధికారుల బృందం కర్నూలుకు చేరుకుంది. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై గురువారం తెలంగాణ హైకోర్టు తీర్పును వెలువరించనుంది. కోర్టు తీర్పు అనంతరం సీబీఐ కీలక నిర్ణయం తీసుకుంది.
అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై గురువారం తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ చేపట్టనుంది. విచారణ జరిపి తీర్పు ఇవ్వాలని హైకోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. విచారణ అనంతరం తీర్పును హైకోర్టు కీలక తీర్పును వెల్లడించనుంది. ఇప్పటికే సీబీఐని అరెస్ట్ చేయకుండా చూడాలన్న.. అవినాష్ విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే.
ముందస్తు బెయిల్ పై అవినాష్ ఆశలు పెట్టుకున్నారు. ఆయన పిటిషన్ లో సునీతారెడ్డి ఇంప్లీడ్ కానున్నారు. అవినాష్ కు ముందస్తు బెయిల్ ఇస్తే కేసులో జరిగే పరిణామాలను.. కోర్టు దృష్టికి తీసుకెళ్తామని సీబీఐ, సునీతారెడ్డి చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే సీబీఐ బృందం కర్నూలుకు చేరుకుంది.