సైబర్ కేటుగాళ్ల పై సీబీఐ కొరడా ఝుళిపించింది. సైబర్ క్రిమినల్స్ పై ఉక్కుపాదం మోపే దిశగా సీబీఐ చర్యలు ప్రారంభించింది. సైబర్ నేరగాళ్లనే లక్ష్యంగా చేసుకుని కేంద్ర దర్యాప్తు సంస్థ దేశ వ్యాప్తంగా దాడులు చేపట్టింది. సైబర్ క్రైమ్కు సంబంధించి ఈ దాడులు జరిగాయి. రాష్ట్ర పోలీసుల సహకారంతో ఈ దాడులు నిర్వహిస్తోంది సీబీఐ. దేశ వ్యాప్తంగా 105 చోట్ల దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో ఏకంగా రూ.1.5 కోట్ల నగదు, 1.5 కేజీల బంగారం స్వాధీనం చేసుకుంది.
ఇంటర్పోల్, ఎఫ్బీఐ, రాయల్ కెనడియన్ మౌంటైన్ పోలీస్, ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీసులు ఇచ్చిన సమాచారంతోనే ఈ దాడులు జరిపినట్లు తెలిపారు.‘ఆపరేషన్ చక్ర’ అనే పేరుతో ఈ దాడులు చేపట్టింది సీబీఐ. అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఇంటర్పోల్లు పంచుకున్న సమాచారం మేరకు.. సీబీఐఐ ఈ స్థలాలపై దాడులు చేసింది. సీబీఐ బృందం దేశవ్యాప్తంగా 87 చోట్ల దాడులు చేయగా, రాష్ట్ర పోలీసులు
18 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ దాడుల్లో 300 మందికి పైగా అనుమానితులను గుర్తించినట్లు తెలుస్తోంది. ఢిల్లీలోని ఐదు చోట్ల దాడులతో పాటు,
అండమాన్, నికోబార్ దీవులు, పంజాబ్, చండీగఢ్, రాజస్థాన్, అస్సాం, కర్ణాటకలో కూడా ఈ బృందం దాడులు నిర్వహించింది. ఈ దాడిలో రాజస్థాన్లోని రాజ్సమంద్లో నకిలీ కాల్ సెంటర్ను రట్టు చేశారు. అమెరికా పౌరులను లక్ష్యంగా చేసుకుని పుణె, అహ్మదాబాద్లలోని రెండు కాల్ సెంటర్లలో సోదాలు నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని అమెరికా దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్బీఐ)కు తెలియజేశామని పేర్కొన్నారు.
వీరంతా యూఎస్లో సైబర్ క్రైమ్లు నిర్వహిస్తున్నారని ఇంటర్పోల్ ద్వారా ఎఫ్బీఐ ఫిర్యాదు అందింది. అందువల్ల, ఈ దాడులకుసంబంధించిన సమాచారాన్ని ఆపరేషన్ చక్ర కింద ఎఫ్బిఐతో సీబీఐ కూడా పంచుకుంది. సైబర్ నేరగాళ్లను కట్టడి చేసేందుకు సీబీఐ తాజాగా సోషల్ మీడియాలో అకౌంట్ క్రియేట్ చేసింది. కేంద్ర దర్యాప్తు సంస్థ తొలిసారిగా ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లో తన ఉనికిని వెల్లడించింది.