తిరుమల ఏఎస్పీ మునిరామయ్యపై సెంట్రల్ క్రైమ్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదైంది. సీఆర్పీసీ 41ఏ సెక్షన్ క్రింద ఆయనకు నోటీసులు జారీ చేశారు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు.
హైదరాబాద్ కు చెందిన చుండూరు సునీల్ కుమార్ అనే వ్యాపారి నుండి రూ 1.2 కోట్లు కాజేసినట్లుగా మునిరామయ్యపై ఆరోపణలు వచ్చాయి. దానికి సంబంధించిన విచారణలో భాగంగా ఏఎస్పీ కి నోటీసులు పంపినట్టు తెలుస్తోంది.
కేసు దర్యాప్తు అధికారిగా ఏసీపీ వెంకట్ రెడ్డిని నియమించారు ఉన్నతాధికారులు. దీనికి సంబంధించి ఏపీ పోలీసులకు సమగ్ర నివేదిక సమర్పించారు హైదరాబాద్ పోలీసులు.
ఏఎస్పీ మునిరామయ్య, జయప్రతాప్, కేవీ రాజుపై కేసు పెట్టారు వ్యాపారి సునీల్ కుమార్. ఈ ఘటన 2019లో జరిగింది. అయితే.. తాను మోసపోయానని తెలిసి.. కేసు పెట్టాను అని వ్యాపారి సునీల్ కుమార్ తెలిపారు.