• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
Tolivelugu Latest Telugu Breaking News » Top News » చెప్పమంటే.. చెప్పేయకూడదు!!

చెప్పమంటే.. చెప్పేయకూడదు!!

Last Updated: December 31, 2022 at 2:38 pm

ప్రతి భారతీయునికి ఆధార్ కార్డు నిత్యావసరమై పోయింది. బ్యాంకులకి వెళ్లినా, ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్ చేసినా, ఇల్లు కొనాలన్నా, అమ్మాలన్నా ఇలా ఒకటి కాదు, ఆఖరికి రైల్వే టికెట్టు కావాలన్నా ఆధార్ తప్పనిసరై పోయింది. అయితే దీనిని చదువుకున్నవారే కాదు, చదువులేని అమాయకులు కూడా వాడుతున్నారు. అయితే వారికి తెలియకుండా ఓటీపీ పంపించమన్న వాళ్లందరికీ పంపించేస్తున్నారు. ఇప్పుడదే పెద్ద సమస్యగా మారిందని కేంద్రం చెబుతోంది. మరి ఆ సంగతులేమిటో చూద్దామా…

భారత దేశానికి ఆధార్ కార్డు ఒక వరంలా మారిందని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడదే శాపంగా కూడా మారిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే ప్రతీ ఒక్కరికి కూడా ఆధార్ లేనిదే పనులు జరగడం లేదు. ముఖ్యంగా ఆన్ లైన్ వ్యవహారాల్లో ఆధార్ కార్డు కీలక భూమిక పోషిస్తోంది. ఇలాంటి సమయంలో కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ కీలక ప్రకటన చేయడం, ప్రజలను అప్రమత్తంగా ఉండమని చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది.

ఇంతకీ కేంద్ర ప్రకటన సారాంశం ఏమిటంటే ఆధార్ కార్డు, వాటి కాపీలను ఎక్కడపడితే అక్కడ పడేయవద్దు, అలాగే ఓటీపీని ఎవరడిగినా చెప్పవద్దని చెబుతోంది. ముఖ్యంగా సామాజిక మాధ్యమాలు, ఇతర బహిరంగ వేదికలపై వీటిని ఇష్టం వచ్చినట్టు పెట్టవదని, ఎవరైనా అడిగితే ‘‘ఓస్…అంతేకదా!’’ అని ఈజీగా పంపించేయవద్దు. ఒకటికి పదిసార్లు ఆలోచించమని చెబుతోంది.

ఇలాగని భయపడవద్దని, ఆధార్ విషయంలో అపోహలు వద్దని, ధైర్యంగానే వాడవచ్చు, కాకపోతే ఆ వినియోగం కరెక్టుగా ఉందా? లేదా? అనేది చూసుకుంటూ ఉండమని తెలిపింది.
ఓటీపీని ఎవరితో షేర్ చేసుకోవద్దని, ఎం-ఆధార్ పిన్ నెంబర్ ఎవరికీ చెప్పవద్దని హెచ్చరించింది. గత ఆరునెలల ఆధార్ వినియోగాన్ని యూఐడీఏఐ వెబ్ సైట్ లో, ఎం-ఆధార్ యాప్ లో చెక్ చేసుకోవచ్చునని సూచించింది.

అయితే ఆధార్ ధృవీకరణ జరిగిన ప్రతీసారి, ఆ విషయాన్ని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ ఈమెయిల్ ద్వారా సమాచారం ఇస్తుందని, అది కూడా ఒకటికి రెండుసార్లు గమనించాలని తెలిపింది. అంటే ఆధార్ తో ఏ పనైనా చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని తెలిపింది. తప్పనిసరిగా ఆధార్ ను ఈమెయిల్ కి అనుసంధానం చేసుకోవాలని సూచించింది.

Primary Sidebar

తాజా వార్తలు

నగరానికి చేరుకున్న యువ క్రికెటర్లు!

రంగంలోకి దిగిన ఆర్బీఐ.. స్థానిక బ్యాంకులతో టచ్ !

నగ ఎత్తుకెళ్ళిన నాటీ ఎలుక…!

దాని పై దృష్టి పెడితే భారత్ నెం.1

ఎలాంటి విచారణ అయినా సిద్ధమే!

ఉభయ సభల్లో బీఆర్ఎస్ వాయిదా తీర్మానాలు

రైట్‌ హ్యాండ్ నుంచి లెఫ్ట్‌ హ్యాండ్‌!

రేపటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు

సీనియర్‌ డైరెక్టర్‌ సాగర్‌ మృతి!

భద్రాచలంలో బూజు పట్టిన లడ్డూలు..మెమోలిచ్చిన ఈవో!

పార్లమెంటును తాకిన ‘అదానీ సెగ’.. మధ్యాహ్నం వరకు వాయిదా

ఇక పై చెప్పం.. మంత్రి సీరియస్ వార్నింగ్‌!

ఫిల్మ్ నగర్

సీనియర్‌ డైరెక్టర్‌ సాగర్‌ మృతి!

సీనియర్‌ డైరెక్టర్‌ సాగర్‌ మృతి!

ప్రభాస్ ప్రాజెక్ట్ కె.. అది ఫేక్ న్యూస్..!

ప్రభాస్ ప్రాజెక్ట్ కె.. అది ఫేక్ న్యూస్..!

త్వరలోనే సూర్య 42 సినిమా టైటిల్‌!

త్వరలోనే సూర్య 42 సినిమా టైటిల్‌!

14 ఏళ్ల తరువాత విజయ్‌ తో త్రిష!

14 ఏళ్ల తరువాత విజయ్‌ తో త్రిష!

కియారా పెళ్లి ముహూర్తం ఫిక్స్‌!

కియారా పెళ్లి ముహూర్తం ఫిక్స్‌!

చీరకట్టులో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న బుట్టబొమ్మ..!

చీరకట్టులో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న బుట్టబొమ్మ..!

దుబాయ్ లో జంటగా దర్శనమిచ్చిన  విజయ్ దేవరకొండ,రష్మిక..!

దుబాయ్ లో జంటగా దర్శనమిచ్చిన విజయ్ దేవరకొండ,రష్మిక..!

ఇన్నాళ్ళకు సోషల్ మీడియాలో మెరిసిన సాయిపల్లవి... !!

ఇన్నాళ్ళకు సోషల్ మీడియాలో మెరిసిన సాయిపల్లవి… !!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap