నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు కేంద్ర ప్రభుత్వం వై కేటగిరి భద్రత కల్పించింది. వైసీపీ ఎమ్మెల్యేల నుంచి తనకు హాని ఉందంటూ రఘురామ కేంద్రానికి చేసిన ఫిర్యాదు మేర దీనిపై స్పందించిన కేంద్రం వై కేటగిరి భద్రతను కల్పించింది. ఈ సందర్భంగా రాఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ తనకు వై కేటగిరి భద్రత కల్పించినట్లు బుధవారం రాత్రి తెలిసిందని, అయితే అధికారికంగా గురువారం లెటర్ రావచ్చునని చెప్పారు.
సుమారు 10 మంది వరకు భద్రతా సిబ్బంది ఉంటారన్నారు. ప్రస్తుతం తన నియోజకవర్గంలో కరోనా కర్ఫ్యూ అమలులో ఉందని, ఈ సమయంలో రావడం సరికాదన్నారు. జిల్లా కలెక్టర్తో మాట్లాడి కర్ఫ్యూ సడలింపు తర్వాత వస్తానన్నారు. తానిచ్చిన ఫిర్యాదుపై వాస్తవ పరిస్థితులను పరిశీలించిన తర్వాతే కేంద్రం తనకు వై కేటగిరి భద్రత కల్పిస్తోందని రఘురామ స్పష్టం చేశారు.