తెలంగాణ రాష్ట్ర సమితి పేరును..” భారత రాష్ట్ర సమితి ” గా ఆమోదిస్తూ.. సీఎం కేసీఆర్ కి కేంద్ర ఎన్నికల సంఘం లేఖ అందజేసింది. ఈ సందర్భంగా శుక్రవారం మధ్యాహ్నం”భారత రాష్ట్ర సమితి” ఆవిర్భావ కార్యక్రమం నిర్వహించి, అందుకు సంబంధించిన అధికారిక కార్యక్రమాలు ప్రారంభించాలని, బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు.
రేపు తెలంగాణ భవన్లో కేంద్ర ఎన్నికల సంఘం పంపిన లేఖ మీద సంతకం చేసి తిరిగి ఎన్నికల సంఘానికి పంపనున్నారు. తరువాత జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్లో రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు, పార్టీ జిల్లాల అధ్యక్షులు, మంత్రులు,ఎంపీలు,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, హాజరుకావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.
వీరితోపాటు.. జిల్లా పరిషత్ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డిసిసిబి అధ్యక్షులు డీసీఎంఎస్ అధ్యక్షులతో పాటు పార్టీ ముఖ్యులు అందరూ శుక్రవారం మధ్యాహ్నం లోపు తెలంగాణ భవనకు చేరుకోవాలని పార్టీ అధినేత సీఎం కేసిఆర్ తెలిపారు.