ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ‘అమరావతి’నే అని కేంద్రం స్పష్టం చేసింది. విభజన చట్టం ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఏపీ ప్రభుత్వం 2015లోనే నోటీఫై చేసిందని కేంద్ర పేర్కొంది.
బుధవారం రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి.. రాజధాని నిర్ణయాధికారం రాష్ట్రానికి ఉంటుందని కేంద్రం చెప్పిందా అని అడిగిన ప్రశ్నకు.. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సమాధానం ఇచ్చింది.
సెక్షన్ 5, 6 ప్రకారమే రాజధాని ఏర్పాటైందని తెలిపింది. ఈ అంశం ప్రస్తుతం కోర్టులో ఉందని పేర్కొంది. దీనిపై మాట్లాడటం సబ్ జ్యుడిస్ అవుతుందని లిఖిత పూర్వక జవాబు ఇచ్చింది.
2020లో ఏపీ ప్రభుత్వం 3 రాజధానుల బిల్లును తెలిచ్చిందని, అయితే ఆ బిల్లు తెచ్చే ముందు ఏపీ ప్రభుత్వం తమను సంప్రదించలేదని తెలిపింది. రాజధానిపై హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఆంధ్ర ప్రదేశ్ లో సుప్రీం కోర్టులో పిటిషన్ వేయగా, ప్రస్తుతం ఈ అంశం కోర్టులో ఉందని కేంద్రం స్పష్టం చేసింది.