అమెరికాలో 9 నుంచి 16 ఏళ్ల మధ్య వయసున్న పిల్లల కోసం డెంగ్యూ వాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. భారత్లో కూడా డెంగ్యూ నివారణకు ఈ తరహా వాక్సిన్ అందించే ప్రయత్నం ప్రభుత్వం చేసిందా..? అని రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కేంద్రాన్ని ప్రశ్నించారు.
విజయశాయి ప్రశ్నకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ జవాబిచ్చారు. కేంద్ర ప్రభుత్వం టీబీ, డెంగ్యూ జబ్బులకు వాక్సిన్లను అభివృద్ధి చేస్తోందన్నారు. వ్యాక్సిన్ సబ్జెక్ట్ ఎక్స్ పర్ట్స్ కమిటీ ఆమోదం పొందిన తర్వాత ఈ రెండింటిని ప్రజలకు అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియ త్వరలో పూర్తవుతుందన్న ఆయన.. వాక్సినేషన్ కూడా షురూ అవుతుందని తెలిపారు.