కరోనా వైరస్ ఎవ్వరినీ వదలడం లేదు. ఏకంగా కేంద్ర హోం మంత్రి అమిత్షా సైతం కరోనా వైరస్ బారినపడ్డారు. తాజాగా నిర్వహించిన పరీక్షలో ఆయనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో ఆయన ఆస్పత్రిలో చేరారు.తనకు కరోనా సోకిన విషయాన్ని స్వయంగా ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు.
నాకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినప్పటికీ.. ఆరోగ్యం బాగానే ఉంది. డాక్టర్ల సలహామేరకు ఆస్పత్రిలో చేరుతున్నాను. ఇటీవల నాతో సన్నిహితంగా ఉన్నవారు కూడా టెస్టు చేసుకోవాలని కోరుతున్నాను అంటూ అమిత్ షా ట్వీట్ చేశారు.
कोरोना के शुरूआती लक्षण दिखने पर मैंने टेस्ट करवाया और रिपोर्ट पॉजिटिव आई है। मेरी तबीयत ठीक है परन्तु डॉक्टर्स की सलाह पर अस्पताल में भर्ती हो रहा हूँ। मेरा अनुरोध है कि आप में से जो भी लोग गत कुछ दिनों में मेरे संपर्क में आयें हैं, कृपया स्वयं को आइसोलेट कर अपनी जाँच करवाएं।
— Amit Shah (@AmitShah) August 2, 2020