కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వచ్చే నెల 15న హైదరాబాద్ లో పర్యటించనున్నారు. అమిత్ షా పర్యటన రోజే సీఏఏ కు అనుకూలంగా సభను నిర్వహించనుంది బీజేపీ. సభ కోసం ఎల్బీ స్టేడియంలో ఇప్పటికే భారీ ఏర్పాట్లను చేస్తున్నారు. మరో వైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ సభకు హాజరవుతారని తెలుస్తోంది.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా సీఏఏను టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. ఇప్పటికే జీహెచ్ఎంసీ కౌన్సిల్ సీఏఏకి వ్యతిరేకంగా తీర్మానం కూడా చేసింది. అలాగే సీఏఏకు వ్యతిరేకంగా వచ్చే బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీలో తీర్మానం చేయబోతున్నట్లు సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. అంతే కాకుండా సీఏఏ కు వ్యతిరేకంగా 10లక్షల మందితో సభ కూడా ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పిన సంగతి తెలిసిందే.