కేంద్ర దర్యాప్తు సంస్థ తీరుతో తమ సీనియర్ నేత ఏడాది కాలంగా జైలులో ఉన్నారని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మండిపడ్డారు. ముంబైలోని ఆర్ధర్ రోడ్ జైలు నుంచి మాజీ హోమ్ మంత్రి అనిల్ దేశ్ ముఖ్ బుధవారం విడుదలయ్యారు. గురువారం ఆయన శరద్ పవార్ తో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో అనిల్ దేశ్ ముఖ్ జైలుకు వెళ్లాల్సి వచ్చిన పరిస్థితులు, జైలులో ఎదుర్కొన్న అవమానాలను అన్నీ పవార్ కు పూసగుచ్చినట్లు చెప్పినట్లు తెలుస్తోంది.
ధికార దుర్వినియోగానికి ఉదాహరణగా ఆయన అభివర్ణించారు. ఈ సమస్యను ప్రధాని మోడీ, హోమ్ మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్తానని ఆయన తెలిపారు. త్వరలోనే మోడీని కలుసుకుని దర్యాప్తు సంస్థల అధికార దుర్వినియోగంపై కంప్లైట్ చేయనున్నట్లు పవార్ పేర్కొన్నారు.
కేంద్ర దర్యాప్తు సంస్థ ఆగడాలకు అనిల్ దేశ్ ముఖ్ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారని పవార్ వెల్లడించారు. అధికారాన్ని ఎలా దుర్వినియోగం చేశారో అనిల్ దేశ్ ముఖ్ కేసులో స్పష్టంగా కనిపిస్తుందన్నారు. దేశ్ ముఖ్ కు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని కోర్టు తన ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నదని పవార్ తెలిపారు.
తొలుత దాదాపు రూ.100 కోట్లు వసూలు చేశారని ఆరోపణలు వచ్చాయి, కానీ చార్జ్ షీట్ లో ఆ సంఖ్య రూ.1 కోటికి తగ్గిందని పేర్కొన్నారు. దేశ్ ముఖ్ ఎదుర్కొన్న పరిస్థితులు మరొకరి రాకుండా ఉండేందుకే ప్రధాని మోడీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లనున్నట్లు స్పష్టం చేశారు శరద్ పవార్.