• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News

Tolivelugu తొలివెలుగు - Latest Telugu Breaking News

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Local News » అంతం దగ్గర్లోనే ఉంది

అంతం దగ్గర్లోనే ఉంది

Last Updated: January 21, 2022 at 6:20 pm

వైసీపీ పాలనతో ప్రజలు పూర్తిగా విసిగిపోయారు.
సీఎం జగన్ రెడ్డి నిర్ణయాలతో నష్టపోని వర్గం అంటూ లేదు.
స్థానిక సమస్యలపై టీడీపీ స్థానిక నాయకత్వం పోరాటాలు పెంచాలి.
ఎన్టీఆర్ ట్రస్ట్ సమన్వయంతో కోవిడ్ బాదితులను ఆదుకోండి.
పార్టీ నేతల ఆన్లైన్ సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపు.

వైసీపీ పాలనతో రాష్ట్ర ప్రజలు పూర్తిగా విసిగిపోయారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారని అన్నారు. ప్రభుత్వ పాలసీలు, పన్నులు, అధికారిక దోపిడీలతో ప్రతీ ఒక్కరి జీవితాన్ని జగన్ ప్రభుత్వం దారుణంగా ప్రభావితం చేసిందని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికే కొన్ని వర్గాలు రోడ్డెక్కి నిరసనలు చేస్తున్నాయని.. రానున్న రోజుల్లో ప్రజలు కూడా స్వచ్చంధంగా తిరగబడే పరిస్థితి వస్తుందని అన్నారు. స్థానికంగా వైసీపీ నేతలు, ఎమ్మెల్యేల దోపిడీ తీవ్రంగా ఉందని.. వాటిపై మండల, నియోజవర్గ స్థాయి నుంచి నేతలు పోరాటాలు చెయ్యాలని పిలుపు నిచ్చారు.

మండల, నియోజకవర్గ స్థాయి పార్టీ నేతలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో పార్టీ సంస్థాగత అంశాలపైనా చంద్రబాబు చర్చించారు. ఇప్పటికీ కొన్ని చోట్ల పెండింగ్ లో ఉన్న గ్రామ, మండల స్థాయి కమిటీల నియామకం పూర్తి చెయ్యాలని ఆదేశించారు. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా దొంగ ఓట్లు చేర్పించడం, ఒక కుటుంబంలోని ఓట్లను వేరు వేరు డివిజన్లకు మార్చడం వంటి చర్యలపై అప్రమత్తంగా ఉండాలని పార్టీ నేతలకు సూచించారు. ప్రజా వ్యతిరేక విధానాలపై కొన్ని చోట్ల అనుకున్నంత ధాటిగా పోరాటాలు జరగడం లేదని.. అలాంటి చోట్ల నేతలు తమ పని తీరు మార్చుకొని.. పార్టీ అభ్యున్నతికి సైనికుల్లా పని చేయాలని చంద్రబాబు కోరారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణపై తన వద్ద పూర్తి సమాచారం ఉందని.. టీడీపీ మరింత దూకుడుగా వెళ్లాలని ఆయా వర్గాలు కోరుతున్నాయన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైసీపీకి దారుణ ఓటమి తప్పదని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో వారికి కూడా క్లారిటీ వచ్చిందని అన్నారు. తమ కష్టాలు పోవాలంటే తెలుగు దేశం ప్రభుత్వం రావాలనే నిర్ణయానికి ప్రజలు వచ్చారని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఒక రాజకీయ పార్టీగా నిత్యం ప్రజా సమస్యలపై పారాటాలు చేస్తూనే ఉండాలని చంద్రబాబు దిశానిర్థేశం చేశారు. పీఆర్సీ విషయంలో ప్రభుత్వం ఉద్యోగులను తీవ్రంగా మోసం చేసిందని.. వారి పోరాటాలకు మద్దతు ఇవ్వాలని తెలిపారు. మనకు ఓటు వేశారా లేదా అనేది ఎప్పుడూ చర్చ కాదని.. బాధిత వర్గం ఎక్కడ ఉన్నా టీడీపీ వారికి అండగా ఉంటుందనే పార్టీ సిద్దాంతమే ముఖ్యం అని నేతలకు గర్తుచేశారు. జీతాలు పెంచమని అడిగిన పాపానికి..ఉన్న జీతాలను తగ్గించిన ప్రభుత్వం వైసీపీ మాత్రమే అని చంద్రబాబు విమర్శించారు. రోడ్ల గుంతలను పూడ్చలేని జగన్.. జిల్లా కో విమానాశ్రయం కడతా అని చెప్తుంటే నవ్వొస్తుందని అన్నారు.

ప్రజా సమస్యలపై పోరాటాలు ఎంత ముఖ్యమో.. వారు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవడం కూడా అంతే ముఖ్యమని అన్నారు చంద్రబాబు నాయుడు. అందులో భాగంగానే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కోవిడ్ రోగులకు మళ్లీ ఉచిత సేవలు మొదలు పెట్టినట్లు ఆయన తెలిపారు. ట్రస్ట్ సౌజన్యంతో రోజూ అందుతున్న టెలిమెడిసిన్ సేవలను గ్రామ స్థాయి వరకు తీసుకువెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. మండల, పార్టీ విభాగాలతో సమన్వయం చేసుకుని.. కోవిడ్ రో గులకు వైద్య పరంగా సహాయం చెయ్యాలని కోరారు. ప్రభుత్వం చెయ్యలేని పనిని.. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఉచిత వైద్య సాయంతో పాటు.. మందుల పంపిణీ కూడా చేస్తున్నట్టు చంద్రబాబు తెలిపారు. గత కోవిడ్ లో ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అందిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసిన పలువురు నేతలు.. మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరికి ధన్యవాదాలు తెలిపారు.

జూమ్ కాల్ ద్వారా జరిగిన ఈ వీడియో కాన్ఫరెన్స్ లో.. మీరు ఎలా ఉన్నారంటూ నేతలు చంద్రబాబును అడిగారు. కోవిడ్ నుంచి వెంటనే కోలుకున్నానని.. తాను పర్ఫెక్ట్ గా ఉన్నానని తెలిపారు. రెండో రోజు నుంచే యథావిధిగా ఆన్లైన్ ద్వారా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాని వారికి బదులిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడుతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.

tolivelugu news - follow on google news
tolivelugu app download


Primary Sidebar

తాజా వార్తలు

లాలూ ప్ర‌సాద్ ఇంట్లో సీబీఐ దాడులు..!

దేశ ప‌ర్య‌ట‌న‌కు కేసీఆర్..!

పీకే ప్లాన్ షురూ..!!

విమానం అత్య‌వ‌స‌ర ల్యాండింగ్.. తృటిలో త‌ప్పిన ప్ర‌మాదం..!

తెలంగాణలో జనసేన.. ఎవరికి నష్టం?

ఈ కారు ధర 14.3 కోట్లు.. !

బ్యాగ్ పోగొట్టుకున్న బ్యూటీ… ! రెడ్ కార్పెట్ పై ఎలా మెరిసిందంటే..!

జ్ఞాన్ వాపి మసీదు కేసులో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు

ఒక్క పైసా సాయం చేయ‌లేదు..!

డబుల్ బెడ్ రూం కాదు.. టాయిలెట్ లో.. !

మస్క్ పై లైంగిక వేధింపుల కేసు…. కప్పిపుచ్చుకునేందుకు..!

సరోగసీ ద్వారా పిల్లలకు జన్మనిచ్చిన సినీ స్టార్స్ ఎవరో తెలుసా ?

ఫిల్మ్ నగర్

సరోగసీ ద్వారా పిల్లలకు జన్మనిచ్చిన సినీ స్టార్స్ ఎవరో తెలుసా ?

సరోగసీ ద్వారా పిల్లలకు జన్మనిచ్చిన సినీ స్టార్స్ ఎవరో తెలుసా ?

న‌ల్ల డ్రెస్ లో నాగిని న‌టి.. సొగ‌సులు ఒల‌క‌బోస్తున్న అందాల బ్యూటీ..!

న‌ల్ల డ్రెస్ లో నాగిని న‌టి.. సొగ‌సులు ఒల‌క‌బోస్తున్న అందాల బ్యూటీ..!

సురేఖతో పెళ్లికి చిరు తండ్రి ఒప్పుకోలేదట!! కానీ

సురేఖతో పెళ్లికి చిరు తండ్రి ఒప్పుకోలేదట!! కానీ

ఎన్టీఆర్ ఇంటి ముందు.. అభిమానుల హంగామా..!

ఎన్టీఆర్ ఇంటి ముందు.. అభిమానుల హంగామా..!

ఆ అగ్రహీరోలపై కేసులు నమోదు...!

ఆ అగ్రహీరోలపై కేసులు నమోదు…!

devi-nagavalli

దేవి నాగవల్లిని ఇమిటేట్ చేస్తూ…జబర్దస్త్ లో స్కిట్

సర్కారువారి పాట మొదటి వారం వసూళ్లు

సర్కారువారి పాట మొదటి వారం వసూళ్లు

వెంకటేశ్ తో అడవి మనిషి సినిమా ప్లాన్ చేశాడంట

వెంకటేశ్ తో అడవి మనిషి సినిమా ప్లాన్ చేశాడంట

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2022 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)