మూడు రాజధానుల అభివృద్ధి కొనసాగుతుందని అసెంబ్లీలో జగన్ చేసిన ప్రకటన.. పచ్చ బ్యాచ్ గుండెల్లో గునపంలా దిగిందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ఏపీలో మూడు రాజధానుల అంశంపై అసెంబ్లీలో స్వల్ప కాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. టీడీపీ నేతలపై ఆయన విమర్శలు గుప్పించారు.
అన్ని ప్రాంతాల అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పేల్చిన టపాసులు, పంచిన మిఠాయిల ఖర్చులు వేస్ట్ అయ్యాయని విమర్శించారు. ఒకే రాజధాని నినాదం అంతులేని వ్యథగా మిగిలిపోయినట్టేనని సంచలన వ్యాఖ్యలు చేశారు.
సారాపై విమర్శల నేపథ్యంలో చంద్రబాబుతో పాటు.. కొన్ని మీడియా సంస్థలపై కూడా విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో విమర్శించారు. చంద్రబాబు ఆయన భజన మీడియా కాలంచెల్లిన మైండ్సెట్ తో అక్కడే గిరికీలు కొడుతున్నాయని వ్యాఖ్యానించారు.
2004లో అలిపిరి దాడిపై ఆశ పెట్టుకుంటే ఏం జరిగింది..? 2019లో పసుపు, కుంకుమలే రంగు వెలిసిపోయేలా చేశాయి. దొంగ తానే అయినా కెలికి మరీ లిక్కర్ బ్రాండ్ల లోగుట్టు బైట పెట్టించుకున్నారు. దిక్కు తోచడం లేదు పాపం’ అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.