• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Top Stories » ఇట్స్ కన్ఫామ్.. పొత్తు పొడుస్తోంది..! లాభం ఎవరికి..? నష్టం ఎవరికి..?

ఇట్స్ కన్ఫామ్.. పొత్తు పొడుస్తోంది..! లాభం ఎవరికి..? నష్టం ఎవరికి..?

Last Updated: January 8, 2023 at 3:45 pm

– ఏపీ పాలిటిక్స్ పై తెలంగాణలో స్కెచ్
– మరోసారి కలిసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్
– 2024 వ్యూహం అమలవుతున్నట్టేనా?
– టీడీపీ, జనసేన పొత్తు ఖాయమైనట్టేనా..?
– పైకి.. జీవో నెంబర్ 1పై చర్చ అంటూ ప్రకటన
– పొత్తులపై చర్చలుంటాయని స్పష్టం
– టీడీపీ, జనసేన కలయిక.. ఏం జరగబోతోంది..?
– ఒకవేళ.. అధికారంలోకి వస్తే ఏం జరుగుతుంది..?
– కాపుల కల నెరవేరుతుందా..?
– పవన్ ను చంద్రబాబు సీఎం చేస్తారా?
– 50-50 ప్లాన్ అమలు అవుతుందా..?

ఏపీలో కుల సమీకరణాలతో రాజకీయాలు నడుస్తుంటాయి. అందుకే.. అక్కడి పాలిటిక్స్ ఎప్పుడూ ఇంట్రస్టింగ్ గా ఉంటాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీని గద్దె దించేందుకు టీడీపీ, జనసేన పోటీ పడుతున్నాయి. అయితే.. వేర్వేరు దారుల్లో వెళ్తున్న ఈ పార్టీలు ఒకే బాటలో నడిస్తే అనుకున్న లక్ష్యం నెరవేరే ఛాన్స్ ఉందని రెండు పార్టీల్లోనూ వినిపిస్తున్న మాట. ఈ క్రమంలో కీలక అడుగులు పడుతున్నట్లు కనిపిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. పైకి.. ఇది జీవో నెంబర్ 1పై చర్చల్లో భాగంగా జరిగిన భేటీ అని చెబుతున్నారు. కానీ, రాజకీయ పండితులు మాత్రం పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఏపీలో వైసీపీ అధికారంలోకి ఉంది. కేంద్రంలోని బీజేపీకి దగ్గరగా ఉంటోంది ఈ పార్టీ. రాష్ట్ర బీజేపీ నేతలు దీన్ని ఖండిస్తున్నా.. అనేక అనుమానాలున్నాయి. ఇదే సమయంలో జనసేనతో తమకు పొత్తు ఉందని చెబుతున్నా.. పవన్ కళ్యాణ్ సైడ్ నుంచి అంత ఆసక్తి లేదనేది విశ్లేషకుల వాదన. మొన్నామధ్య ప్రధాని మోడీ వైజాగ్ పర్యటనకు వచ్చినప్పుడు పవన్ కలిశారు. ఈ మీటింగ్ టాక్స్ పై ఎలాంటి లీక్స్ ఇవ్వలేదు. ఏం జరిగిందో? దేనిపై మాట్లాడుకున్నారో ఇప్పటికీ సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే.. అనూహ్యంగా ఆ సమయంలో పవన్ ని కలిశారు చంద్రబాబు. దీంతో పొత్తుపై ఊహాగానాలు ఊపందుకున్నాయి.

ఆనాడు పవన్ టూర్ పై ఆంక్షలను ఖండిస్తూ చంద్రబాబు వెళ్లి కలిస్తే.. ఇప్పుడు చంద్రబాబు టూర్ పై ఆంక్షలను ఖండిస్తూ పవన్ కలిశారు. ఈ సందర్భంగా బాబు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికి జీవో నెంబర్ 1పై చర్చించామని.. ఎన్నికలు, పొత్తులపై తర్వాత మాట్లాడుకుంటామన్నారు. అన్ని పార్టీలు, సంఘాలు కలిసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో చాలా పొత్తులు పెట్టుకుంటామని.. 2009లో టీఆర్ఎస్ తో కలిసిన విషయాన్ని గుర్తు చేశారు. ముందు పొత్తు పెట్టుకున్నా ఆ తర్వాత విభేదించామని వివరించారు. రాజకీయాల్లో సమీకరణాలు మారుతుంటాయని తెలిపారు చంద్రబాబు. అంటే.. జనసేనతో ముందు పొత్తు పెట్టుకున్నాం.. తర్వాత విభేదాలు వచ్చాయి.. ఇప్పుడు మళ్లీ కలుస్తాం అనేలా హింట్ ఇచ్చారని అంటున్నారు విశ్లేషకులు.

టీడీపీ, జనసేన కలిస్తే.. వైసీపీని గద్దె దించడం పెద్ద కష్టమేం కాదనేది విశ్లేషకుల వాదన. 2014 ఎన్నికల్లో జరిగిన ఉదాహరణలు, 2019లో టీడీపీ, జనసేనకు వేర్వేరుగా వచ్చిన ఓట్లను పోల్చి చూస్తే.. వైసీపీ వాటి వెనకే ఉంటుందని అంటున్నారు. అయితే.. ఇప్పుడు ఈ రెండు పార్టీలు కలిసి గెలిచినా.. సీఎం కుర్చీ ఎవరిదనే చర్చ కూడా ఉంది. ఎందుకంటే.. జనసేనకు కాపుల బలం ఎక్కువ. కులం కార్డు వద్దని పవన్ కళ్యాణ్ చెబుతున్నా.. పార్టీకి అధికంగా వెన్నుదన్నుగా ఉంది కాపులే. ఉండటానికి అత్యధికంగా ఉన్నా కూడా కాపులకు అధికారం దక్కలేదు. ఆనాడు వంగవీటి రంగా రూపంలో ఓ ఆశ కలిగినా.. ఆయన్ను హత్య చేయడంతో ఆ ఆశలు ఆవిరయ్యాయి. ఆ తర్వాత కాపులు పార్టీల వారీగా చీలిపోయి తలోదిక్కు అయ్యారు. 2009 సమయంలో చిరంజీవి వచ్చినా తొక్కేశారనే ఆరోపణలు ఉన్నాయి. కానీ, ఇప్పుడు పవన్ కళ్యాణ్ రూపంలో కాపుల్లో ఓ ఆశ ఉంది. తమ వర్గం నాయకుడు సీఎం కావాలనే కలను పవన్ తీరుస్తారని బలంగా నమ్ముతున్నారు. అయితే.. చంద్రబాబు ఆ ఛాన్స్ ఇస్తారా? లేదా? అనే చర్చ జరుగుతోంది. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా.. జనసేన రెండున్నరేళ్లు, టీడీపీ రెండున్నరేళ్లు పాలన సాగిస్తే కాపుల కల కూడా నెరవేరినట్టు అవుతుందని కొందరు అంటున్నారు. ఇక్కడ ఇంకో చర్చ కూడా సాగుతోంది. టీడీపీ, బీజేపీకి గత ఎన్నికల సమయం నుంచి పడడం లేదు. ఇప్పుడు జనసేన, టీడీపీకి దగ్గరైతే బీజేపీకి దూరం అవ్వాల్సిందే. చూడాలి.. రానున్న రోజుల్లో ఇంకెలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో.

Primary Sidebar

తాజా వార్తలు

టాలీవుడ్ లో విషాదం.. కళాతపస్వి విశ్వనాథ్ కన్నుమూత!

టిక్కెట్ అడిగినందుకు కన్నబిడ్డను ఎయిర్ పోర్ట్లో వదిలేసిన జంట..!

పెళ్ళి వేడుకలో క్రాకర్స్ కోసం కొట్టుకున్నారు..!

జొమాటో గులాబ్ జామూన్స్ రేటు చాలా ఘాటు …!

విమానయాన పరిశ్రమ నష్టాల్లో ఉంది…!

5న కేబినెట్ సమావేశం…!

నటి పాకీజా, కెమెరా మేన్ దేవరాజ్ లకు చిరంజీవి ఆపన్న హస్తం..!

శుక్రవారం నుంచి అరెస్టులే… సీఎం సంచలన ప్రకటన…!

ప్రకంపనలు రేపుతున్న రెండో ఛార్జ్ షీట్

టైగర్ టీ బ్రేక్ … వీడియో వైరల్ !

వీర సింహారెడ్డి సినిమా ఆ టీడీపీ లీడర్ స్పూర్తితో వచ్చిందా…?

రకుల్ కి ఆ సినిమా కలిసిరాలేదా…? అందుకే టాలీవుడ్ లో కనపడటం లేదా…?

ఫిల్మ్ నగర్

టాలీవుడ్ లో విషాదం.. కళాతపస్వి విశ్వనాథ్ కన్నుమూత!

టాలీవుడ్ లో విషాదం.. కళాతపస్వి విశ్వనాథ్ కన్నుమూత!

నటి పాకీజా, కెమెరా మేన్ దేవరాజ్ లకు చిరంజీవి ఆపన్న హస్తం..!

నటి పాకీజా, కెమెరా మేన్ దేవరాజ్ లకు చిరంజీవి ఆపన్న హస్తం..!

ఫోటోలు పెట్టింది.. ట్రోలర్స్‌కి చిక్కింది!

ఫోటోలు పెట్టింది.. ట్రోలర్స్‌కి చిక్కింది!

సీనియర్‌ డైరెక్టర్‌ సాగర్‌ మృతి!

సీనియర్‌ డైరెక్టర్‌ సాగర్‌ మృతి!

ప్రభాస్ ప్రాజెక్ట్ కె.. అది ఫేక్ న్యూస్..!

ప్రభాస్ ప్రాజెక్ట్ కె.. అది ఫేక్ న్యూస్..!

త్వరలోనే సూర్య 42 సినిమా టైటిల్‌!

త్వరలోనే సూర్య 42 సినిమా టైటిల్‌!

14 ఏళ్ల తరువాత విజయ్‌ తో త్రిష!

14 ఏళ్ల తరువాత విజయ్‌ తో త్రిష!

కియారా పెళ్లి ముహూర్తం ఫిక్స్‌!

కియారా పెళ్లి ముహూర్తం ఫిక్స్‌!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap