• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Hyderabad » త్వరలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలపై ఛార్జ్ షీట్..!

త్వరలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలపై ఛార్జ్ షీట్..!

Last Updated: January 4, 2023 at 1:30 pm

చైనా మన దేశ భూభాగాన్ని ఆక్రమించుకుంటున్నా ప్రధాని పట్టించుకోవడం లేదని..పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి కేంద్రం ప్రభుత్వాలను మారుస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. హైదరాబాద్ లోని బోయిన్ పల్లి గాంధీ ఐడియాలజీ సెంటర్ లో కాంగ్రెస్ అవగాహన సదస్సులో రేవంత్ రెడ్డి బీఆర్ఎస్, బీజేపీల తీరు పై మండిపడ్డారు.

చైనా దురాక్రమణ పై రాహుల్ గాంధీ ఆధారాలతో సహా వివరించారని రేవంత్ తెలిపారు. ప్రజల సమస్యలను తీర్చడానికే రాహుల్ గాంధీ జోడో యాత్ర చేస్తున్నారని అన్నారు. 2004 లో అధికారం వచ్చినా రాహుల్ గాంధీ ప్రధాని పదవి తీసుకోలేదని చెప్పారు. చలికి భయపడకుండా రాహుల్ గాంధీ యాత్ర చేస్తున్నారని కొనియాడారు. దేశం క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆదుకుందని రేవంత్ గుర్తు చేశారు.

దేశాన్ని కులం,మతం ఆధారంగా విడగొడుతున్నారని ఆరోపించారు. చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్ కు కృషి  చేసిన పార్టీ కాంగ్రెస్ అని అన్నారు.  ధరణితో లక్షలాది మంది రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. ఓటరు లిస్ట్ లో కాంగ్రెస్ సానుభూతి పరుల ఓట్లు తొలగిస్తే వాటిని తిరిగి చేర్పించాల్సిన అవసరం ఉందన్నారు. కేంద,రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై ఛార్జిషీట్ విడుదల చేసి,వాటిని ప్రజల్లోకి తీసుకెళ్తామని ఆయన తెలిపారు.

నిపుణుల సూచనలతో భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని స్పష్టం చేశారు. 2003 లో ఎలాంటి విపత్కర పరిస్థితులను ప్రజలు ఎదుర్కొన్నారో 2023 లో కూడా అలాంటి పరిస్థితులే రాష్ట్రంలో నెలకొన్నాయన్నారు. అందరం కలిసికట్టుగా కష్టపడితే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. అయితే ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేతలు, పీసీసీ వ్యతిరేక నేతలు అందరూ కలిసి పాల్గొనడం విశేషం.

Primary Sidebar

తాజా వార్తలు

షెడ్యూల్ ప్రకారమే సమావేశాలు.. కానీ..!

రైతు ఆత్మహత్యలపై ఎన్‌హెచ్‌ఆర్సీలో ఫిర్యాదు…!

పుతిన్ ను వ్యతిరేకిస్తూ పోస్టులు… యువతిని ఉగ్రవాదులు జాబితాలో చేర్చిన రష్యా…!

మంత్రి హరీష్ ఫెల్యూర్ మినిస్టర్ అనుకున్నాం.. కానీ ఫేక్ మినిస్టర్

గవర్నర్ తమిళిసైతో ముగిసిన మంత్రుల సమావేశం

రాజ్‌ భవన్‌ను రాజకీయాలకు అడ్డాగా మార్చడం మానుకోవాలి….!

వంద రూపాయలతో వచ్చి ఆసియాలో అతిపెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించి….!

శాకుంతలంకు సమంతా ఈ రేంజ్ లో తీసుకుంటుందా…?

భారీ లాభాలు వచ్చిన తెలుగు సినిమాలు ఇవే…!

మగాళ్ళకు కూడా క్యాస్టింగ్ కౌచ్ ఉంటుంది, నటుడి సంచలన కామెంట్స్…!

నితిన్ – తేజా ఎందుకు మాట్లాడుకోవట్లేదు…?

‘ఆ అన్న చెల్లెళ్లిద్దరూ స్నో బాల్స్ తో ఆడారు.. మోడీ చలవే మరి ‘

ఫిల్మ్ నగర్

గూజ్ బంప్స్ తెప్పిస్తున్న నాని మూవీ టీజర్!

గూజ్ బంప్స్ తెప్పిస్తున్న నాని మూవీ టీజర్!

హాట్ బ్యూటీ ఇలియానాకు అస్వస్థత

హాట్ బ్యూటీ ఇలియానాకు అస్వస్థత

మరికొన్ని పరీక్షలు చేసిన తరువాతే స్పష్టత!

మరికొన్ని పరీక్షలు చేసిన తరువాతే స్పష్టత!

స్టైలిష్‌ లుక్‌లో పవర్‌ స్టార్‌!

స్టైలిష్‌ లుక్‌లో పవర్‌ స్టార్‌!

ఘనంగా పూర్ణ సీమంతం వేడుకలు!

ఘనంగా పూర్ణ సీమంతం వేడుకలు!

మహేశ్‌ సినిమాలో నీలి కళ్ల సుందరి!

మహేశ్‌ సినిమాలో నీలి కళ్ల సుందరి!

టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ లేదంటున్న హీరోయిన్

టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ లేదంటున్న హీరోయిన్

బాహుబలిని కొట్టే సినిమా వస్తోందట!

బాహుబలిని కొట్టే సినిమా వస్తోందట!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap