వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ భారత పౌరసత్వంపై కేసు మరోసారి వాయిదా పడింది. ఈ కేసులో ఇప్పటికే కేంద్రం తన వాదనలను అఫిడవిట్ రూపంలో దాఖలు చేసింది. చెన్నమనేని రమేష్ జర్మనీ పౌరుడే అని తేల్చి చెప్పగా, తనను అనర్హుడిగా ప్రకటించాలని కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ బలంగా వాదిస్తున్నారు.
అయితే, ఈ కేసును ప్రత్యక్షంగా వినాలని ఇటు చెన్నమనేని కోర్టును కోరారు. అడిషనల్ అడ్వకేట్ జనరల్ కూడా కేసును ప్రత్యక్షంగా విని నిర్ణయం తీసుకోవాలని కోరటంతో… రెండు వారాల తర్వాత కేసును ప్రత్యక్షంగా వినేందుకు హైకోర్టు అంగీకరించింది. అయితే, ఇదంతా అనర్హత వేటును ఆలస్యం చేయటానికే అంటూ పిటిషనర్ ఆరోపించారు.