• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News

Tolivelugu తొలివెలుగు - Latest Telugu Breaking News

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Hyderabad » పబ్లిసిటీ కోసం..ప్రజలను రెచ్చగొట్టొద్దు

పబ్లిసిటీ కోసం..ప్రజలను రెచ్చగొట్టొద్దు

Last Updated: March 18, 2022 at 8:06 pm

– ఆదివాసీలకు ఎంతో సేవ చేశాము
-స్త్రీని పూజించిన సంప్రదాయం నుంచి వచ్చాను
-కావాలనే కలతలు సృష్టించే యత్నాలు!
– నాకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యం లేదు
– మీడియా కోడిగుడ్లపై ఈకలు లాగొద్దు
– చిన జీయర్ సంచలన వ్యాఖ్యలు

తాడేపల్లి, తొలివెలుగు: ఆదివాసీలకు, ముఖ్యంగా మహిళలకు అగ్రాసనం ఉండాలనే సంప్రదాయం నుంచి తాము వచ్చామని.. వాళ్లను చిన్నచూపు చూసేలా మాట్లాడే అలవాటు తమకు లేదని చినజీయర్ స్వామి అన్నారు. మేడారం సమ్మక్క సారలమ్మ పై గతంలో తాను చేసిన వ్యాఖ్యలపై వివాదం రేగడంతో ఆయన వివరణ ఇచ్చారు.తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆదివాసీ గ్రామ దేవతలను తూలనాడినట్లు చేస్తున్న ప్రచారం సరికాదని హితవు పలికారు. పూర్వాపరాలు చూడాలని.. మధ్యలో మాట్లాడిన ఒక మాటను చూపించి విమర్శించడం సరికాదన్నారు.
ఆ దేవతలు స్వర్గం నుంచి దిగిరాలేదని..గ్రామసీమల్లో ఉంటూ మన కోసం పాటుపడ్డ మహోన్నతులే సమ్మక్కసారలమ్మ లు అన్నదే తన ఉద్దేశ్యం అన్నారు. ఆదివాసీలైనా..ఇంకెవరైనా పుట్టుకపరంగా కాకుండా.. జ్ఞానం ఆధారంగా వారిని ఉత్తములుగా భావించాలని వ్యాఖ్యానించారు. ఎవరైనా ఎక్కడైనా..అసాంఘిక కార్యక్రమాన్ని ప్రోత్సహించవద్దనేదే తమ సూచన అని స్పష్టం చేశారు చినజీయర్. నిర్వహణ కోసమే సమతామూర్తి విగ్రహం చూడడానికి టికెట్ పెట్టామని స్పష్టం చేశారు.అంతేగాని అక్కడ పూజలకు, ప్రసాదాలకు టికెట్లు లేవని గుర్తుంచుకోవాలని తేల్చిచెప్పారు. మీడియా కోడిగుడ్లపై ఈకలు లాగవద్దన్నారు. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యం లేదని స్పష్టం చేశారు.విషయం తెలుసుకోకుండా ప్రశ్నలు అడగవద్దని ఘాటుగా మాట్లాడారు చినజీయర్ స్వామి.


ఇవాళ లక్ష్మీ దేవీ పుట్టిన రోజు. పాలసముద్రంలో పుట్టి భగవంతుడి దగ్గరకు చేరిన రోజు.ఈ రోజును అంతర్జాతీయ వైదిక మహిళా దినోత్సవంగా భావించాలని పేర్కొన్నారు జీయర్ స్వామి. మహిళ ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని అన్నారు. ప్రపంచంలోని మహిళలందరికీ మంగళాశాసనాలు తెలియ చేస్తున్నామని వ్యాఖ్యానించారు. ఎవరికి జ్ఙానం విలక్షణంగా ఉంటే.. వారికి ఆరాధ్య స్థానం కల్పించాలని రామానుజాచార్యులు సూచించారని పేర్కొన్నారు.
సమాజం అనే వేదిక మీద అంతా కలిసి ముందుకు సాగాలని సూచించారు. ఒక వేదిక దొరికిందని రకరకాలుగా మాట్లాడడం మంచిది కాదని విమర్శించారు.తాత్కాలిక ప్రయోజనాల కోసం, పబ్లిసిటీ కోసం ప్రజల్ని రెచ్చగొట్టడం సరికాదని మండిపడ్డారు. సమాజ హితం కాంక్షించేవారు కూర్చుని ఆలోచించాలని హితవు పలికారు. ఆదివాసీలను గౌరవించే సంప్రదాయం ఉండాలని రామానుజాచార్యులు సూచించారన్నారు. 1938లోనే తూర్పుగాదావరి జిల్లాలోని అత్తలూరులో శ్రీమన్నారాయణ హరిజన కాలనీ నిర్మాణం జరిగిందని గుర్తు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీల కోసం స్కూలును 2004లో ప్రారంభించామని వివరించారు.

నారీమణులందరికీ మంగళాశాసనాలు చేస్తున్నామన్నారు. శ్రీరంగం క్షేత్రంలో అమ్మవారు,అయ్యవారు కలిసి ఉంటారని.. అమ్మ వారితో కలిసి ఉండగానే అయ్యవారిని ఆశ్రయించాలన్నారు. ఒక జంతువు,పక్షి,ఆకు,మనం తినే ఆహారంతో కలిసి ఉంటుందన్నారు. మనిషి ప్రకృతిని, ప్రాణ కోటిని పూజిస్తామని.. అందులో భాగంగానే దసరా నాడు జమ్మి చెట్టును పూజిస్తామని చెప్పారు. అపార్థాలకు తావివ్వకుంటే సమాజం బాగుంటుందని చెప్పారు చినజీయర్ స్వామి.

tolivelugu news - follow on google news
tolivelugu app download


Primary Sidebar

తాజా వార్తలు

నవీన్ మిట్టల్‌ దౌర్జన్యాలపై నిష్పాక్షికంగా విచారించాలని లేబర్ కమిషనర్‌కు కాంగ్రెస్ వినతి

గ్రామ‌పంచాయ‌తీ కార్యాల‌యం ముందు.. శ‌వంతో ధ‌ర్నా..!

త‌మిళ‌నాట.. తెలుగు ప్రాణం పోయండి..!

వృద్ధ దంపతుల సూసైడ్‌కు కేసీఆరే బాధ్యుడు..ఎన్‌హెచ్‌ఆర్‌సీలో జడ్సన్ ఫిర్యాదు

క్వాడ్ సమావేశం.. ప్రధాని మోడీ ఫోటో వైరల్

నాయకులు వస్తుంటారు.. పోతుంటారు…!

అంతా ఓకే.. పోలీసులకు సెల్యూట్‌!

అక్రమ దందా ఆపాలని శనాయిపల్లి గ్రామస్తుల నిరాహార దీక్ష

క‌శ్మీర్ లో కాల్పులు.. ముగ్గురు ఉగ్ర‌వాదులు హ‌తం..!

అవినీతి మంత్రిపై చర్యలేవి.. కోమటిరెడ్డి సూటిప్రశ్న!

ప్రధానికి ముఖం చూపించలేకే..!

మోడీ ప‌ర్య‌ట‌న షెడ్యూల్..!

ఫిల్మ్ నగర్

రెడ్‌ కార్పెట్‌ పై నర్గీస్‌.. నీ సొగసు చూడతరమా!

రెడ్‌ కార్పెట్‌ పై నర్గీస్‌.. నీ సొగసు చూడతరమా!

పవన్ అక్కడకు ఎందుకు వెళ్ళాడో తెలుసా! పిక్ వైరల్

పవన్ అక్కడకు ఎందుకు వెళ్ళాడో తెలుసా! పిక్ వైరల్

ఆర్ఆర్ఆర్ కన్నా డిజె టిల్లు టాప్!! ఎలానో తెలుసా ?

ఆర్ఆర్ఆర్ కన్నా డిజె టిల్లు టాప్!! ఎలానో తెలుసా ?

అప్పటి హీరోయిన్ సిమ్రాన్...ఇప్పుడు ఎలా మారిపోయింది చూశారా?

అప్పటి హీరోయిన్ సిమ్రాన్…ఇప్పుడు ఎలా మారిపోయింది చూశారా?

ఫిట్ నెస్ రంగంలో.. సినీ తార‌లు..!

ఫిట్ నెస్ రంగంలో.. సినీ తార‌లు..!

అమిత్ షా కోసం 'పృథ్విరాజ్' స్పెషల్ ప్రివ్యూ

అమిత్ షా కోసం ‘పృథ్విరాజ్’ స్పెషల్ ప్రివ్యూ

15 వందలతో మొదలు పెట్టిన స్టార్ హీరోయిన్.. అగ్రిమెంట్ కాపీ వైరల్!

15 వందలతో మొదలు పెట్టిన స్టార్ హీరోయిన్.. అగ్రిమెంట్ కాపీ వైరల్!

మిస్టర్ పర్ ఫెక్ట్ తో నాకు సంబంధం లేదు

మిస్టర్ పర్ ఫెక్ట్ తో నాకు సంబంధం లేదు

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2022 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)