• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Top News » తెరుచుకున్న సరిహద్దులు.. కోవిడ్ ఆంక్షలను ఎత్తేసిన చైనా

తెరుచుకున్న సరిహద్దులు.. కోవిడ్ ఆంక్షలను ఎత్తేసిన చైనా

Last Updated: January 8, 2023 at 12:29 pm

ఓవైపు తమ దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ ఏ మాత్రం తగ్గకున్నా.. చైనా తన సరిహద్దులను తిరిగి తెరచింది. కోవిడ్ సంబంధిత అనేక ఆంక్షలను ఎత్తివేసింది. ఆదివారం నుంచే అవి అమలులోకి వస్తాయని, అంతర్జాతీయ ప్రయాణికులకు బోర్డర్స్ ని పునరుద్ధరించాలని నిర్ణయించామని ఈ దేశ సివిల్ ఏవియేషన్ రెగ్యులేటర్ ప్రకటించినట్టు ది గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది. దాదాపు మూడేళ్లకు పైగా చైనా తన సరిహద్దులను మూసి ఉంచింది. అయితే జనవరి 8 నుంచి తిరిగి తెరుస్తామని ఇదివరకే ప్రకటించింది.

China's open borders mark end to 'zero-COVID,' sparking homecoming rush | The Japan Times

విదేశాల నుంచి తమ దేశానికి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు క్వారంటైన్ తప్పనిసరి చేయాలన్న నిబంధనను కూడా ప్రభుత్వం రద్దు చేసినట్టు గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. వీరు తప్పనిసరిగా మూడు వారాలపాటు క్వారంటైన్ కేంద్రాలకు వెళ్లాలని ఇదివరలో ఆదేశించిన అధికారులు.. ఇకపై ఈ అవసరం లేదని స్పష్టం చేశారు.

నిజానికి ప్రభుత్వం తన జీరో కోవిడ్ పాలసీని మధ్యలోనే విరమించుకోవడంతో దేశంలో కోవిడ్ కేసులు పెరిగిపోయాయి. ఆసుపత్రులన్నీ కరోనా రోగులతో కిటకిటలాడుతుండగా.. కోవిడ్ టెస్టింగ్ కేంద్రాల వద్ద టెస్టుల కోసం ప్రజలు బారులు తీరుతున్నారు. మందుల కొరత ఈ దేశాన్ని తీవ్రంగా పీడిస్తోంది. చైనా నుంచి వస్తున్న ప్రయాణికులపై అనేక దేశాలు ప్రయాణ సంబంధ ఆంక్షలను కొనసాగిస్తున్నాయి.

డ్రాగన్ దేశం నుంచి వస్తున్నవారు తప్పనిసరిగా కోవిడ్ నెగెటివ్ రిపోర్టులు సమర్పించాలని నెదర్లాండ్స్, పోర్చుగల్ తదితర దేశాలు ఆదేశిస్తున్నాయి. కరోనా కేసులు పెద్ద సంఖ్యలో ఉండగా.. దేశీయంగా ప్రయోగాత్మకంగా తమ ఎం ఆర్ ఎన్ ఏ వ్యాక్సిన్ ని ఉత్పత్తి చేయాలని చైనా ప్రభుత్వం నిర్ణయించింది. ఒమిక్రాన్ కొత్త వేరియంట్లను ఎదుర్కొనే సిఎస్-2034 అనే ఈ వ్యాక్సిన్ ని ఇక తయారు చేస్తామని అధికార వర్గాలు తెలిపాయి. స్కూలు విద్యార్థులు తప్పనిసరిగా నెగెటివ్ కోవిడ్ రిపోర్టును సమర్పించాలన్న రూల్ ని కూడా ఈ దేశంలో ఎత్తేశారు.

Primary Sidebar

తాజా వార్తలు

ఆ లేఖ నకిలీది… క్లారిటీ ఇచ్చిన మాజీ సీఎం…!

శంకరాభరణం విడుదలైన రోజే.. విశ్వనాథ్‌ కన్నుమూత!

అగ్ని ప్రమాదం పై నిజనిర్ధారణకు అఖిలపక్ష బృందాన్ని అనుమతించాలి!

యాదాద్రీశ్వరుడిని దర్శించుకున్న గవర్నర్

కళాతపస్వికి ప్రముఖుల నివాళులు!

నూతన సెక్రటేరియట్ వెనుక భాగంలో అగ్నిప్రమాదం…!

కళాతపస్వికి ”ఎస్‌” అనే సెంటిమెంట్‌ ఎందుకంటే!

ప్రతిపక్ష పార్టీల అత్యవసర సమావేశానికి ఖర్గే పిలుపు…!

తొందరపాటు వల్లే అగ్ని ప్రమాదం: బండి!

నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు..!

బీబీసీ డాక్యుమెంటరీ బ్యాన్ పై నేడు సుప్రీం కోర్టులో విచారణ…!

తెలంగాణ కొత్త సచివాలయంలో అగ్నిప్రమాదం…!

ఫిల్మ్ నగర్

శంకరాభరణం విడుదలైన రోజే.. విశ్వనాథ్‌ కన్నుమూత!

శంకరాభరణం విడుదలైన రోజే.. విశ్వనాథ్‌ కన్నుమూత!

కళాతపస్వికి ప్రముఖుల నివాళులు!

కళాతపస్వికి ప్రముఖుల నివాళులు!

కళాతపస్వికి ''ఎస్‌'' అనే సెంటిమెంట్‌ ఎందుకంటే!

కళాతపస్వికి ”ఎస్‌” అనే సెంటిమెంట్‌ ఎందుకంటే!

టాలీవుడ్ లో విషాదం.. కళాతపస్వి విశ్వనాథ్ కన్నుమూత!

టాలీవుడ్ లో విషాదం.. కళాతపస్వి విశ్వనాథ్ కన్నుమూత!

నటి పాకీజా, కెమెరా మేన్ దేవరాజ్ లకు చిరంజీవి ఆపన్న హస్తం..!

నటి పాకీజా, కెమెరా మేన్ దేవరాజ్ లకు చిరంజీవి ఆపన్న హస్తం..!

ఫోటోలు పెట్టింది.. ట్రోలర్స్‌కి చిక్కింది!

ఫోటోలు పెట్టింది.. ట్రోలర్స్‌కి చిక్కింది!

సీనియర్‌ డైరెక్టర్‌ సాగర్‌ మృతి!

సీనియర్‌ డైరెక్టర్‌ సాగర్‌ మృతి!

ప్రభాస్ ప్రాజెక్ట్ కె.. అది ఫేక్ న్యూస్..!

ప్రభాస్ ప్రాజెక్ట్ కె.. అది ఫేక్ న్యూస్..!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap